logo

సభాపతి కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు

సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రెండో సారి కరోనా వైరస్‌ బారిన పడిన

Updated : 18 Jan 2022 14:01 IST

బీర్కూర్‌: సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రెండో సారి కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్‌ ఆలయంలో ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, ఏఎమ్‌సీ ఛైర్మన్‌ అశోక్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు అరీఫ్‌, రైసస గ్రామ అధ్యక్షుడు గంగారాం, తెరాస నాయకులు గంగాధర్‌, లాయక్‌, హైమద్‌, మన్నాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని