logo

బీర్కూర్‌లో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం

మండల కేంద్రంలోని రంగాజీనగర్‌ కాలనీలో మంగళవారం

Updated : 18 Jan 2022 14:03 IST

బీర్కూర్‌: మండల కేంద్రంలోని రంగాజీనగర్‌ కాలనీలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి తెదేపా నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జహీరాబాద్‌ పార్లమెంట్‌ తెదేపా ప్రధాన కార్యదర్శి ఓంకార్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు సాయిలు యాదవ్‌, ఉమ్మడి జిల్లాల తెదేపా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, రమేశ్‌, రమణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని