logo

ముగిసిన పీబీఆర్‌ క్రికెట్‌ టోర్నీ

మండల కేంద్రంలో ఈ నెల 5న తెరాస యువజన సంఘం మండలాధ్యక్షుడు మియాపురం శశికాంత్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన పీబీఆర్‌(పోచారం భాస్కర్‌రెడ్డి) క్రికెట్‌

Published : 18 Jan 2022 19:55 IST

బీర్కూరు : మండల కేంద్రంలో ఈ నెల 5న తెరాస యువజన సంఘం మండలాధ్యక్షుడు మియాపురం శశికాంత్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన పీబీఆర్‌(పోచారం భాస్కర్‌రెడ్డి) క్రికెట్‌ టోర్నీ ముగిసింది. రెండు వారాల పాటు హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో 30జట్లు పాల్గొన్నాయి. ప్రథమ విజేతగా నిలిచిన బీర్కూరు జట్టుకు రూ.11,500 నగదు, ద్వితీయ జట్టు వర్నికి రూ.7,500 నగదుతో పాటు ట్రోఫీలను ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రైసస గ్రామ అధ్యక్షుడు గంగారాం, టోర్నీ నిర్వాహకులు ప్రవీణ్‌, సాయి, రాజు, గజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని