వర్గపోరు.. వీడియోల జోరు
అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. మాక్లూర్ మండలంలో వివాదాలే ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. సొంత పార్టీలో కొనసాగుతున్న సర్పంచుల భర్తలు ఎమ్మెల్యేపై విమర్శలకు దిగుతున్నారు. వీడియోలు
ఈనాడు, నిజామాబాద్ : అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. మాక్లూర్ మండలంలో వివాదాలే ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. సొంత పార్టీలో కొనసాగుతున్న సర్పంచుల భర్తలు ఎమ్మెల్యేపై విమర్శలకు దిగుతున్నారు. వీడియోలు తీసి మరీ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. తాము చేసే వ్యాపారాలు, పంచాయతీల్లో చేసిన పనులపై విచారణలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దేనికీ భయపడమని..రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని సవాళ్లు విసురుతున్నారు. ఇది ఆరంభమే..ఇంతటితో ఆగదంటూ..ఒక్కో వీడియో బయటకొస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలే ఈ పరిణామాలకు కారణమని కార్యకర్తలు బహిరంగంగానే పేర్కొంటున్నారు.
ఒక్కొక్కరుగా.. బహిరంగంగా.. : మాక్లూర్ మండలంలో ఇద్దరు సర్పంచుల భర్తలపై అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు వెళ్లాయి. ముల్లంగి సర్పంచి భర్త శ్యాంరావు ఇసుక వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు చెందిన ఇసుక డంపులను పోలీసులు సీజ్ చేశారు. మరుసటి రోజే గనులశాఖ అధికారి వెళ్లి పరిశీలించారు. ఇదంతా ఎమ్మెల్యే బెదిరింపు చర్చేనని సర్పంచి బహిరంగంగా ఆరోపణ చేస్తున్నారు. పైగా జడ్పీఛైర్మన్తో అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఓర్వకనే ఇలా చేయించారని ఆరోపించారు. శ్యాంరావు ఆరోపణలపై ఎమ్మెల్యేగాని, జడ్పీ ఛైర్మన్గాని స్పందించకపోవటం గమనార్హం. ఇప్పటికే ఆడిట్ పూర్తయిన కల్లెడి పంచాయతీ రికార్డులను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీలో నిధులు దుర్వినియోగమైందంటూ సర్పంచిపై సోమవారం ఫిర్యాదు వచ్చిందని, ఈ నేపథ్యంలోనే రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కల్లెడి సర్పంచి భర్త ప్రసాద్ సైతం బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఎమ్మెల్యేపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమపై కావాలనే దాడులు చేయిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు బయపడేది లేదన్నారు. తమ గ్రామ పాఠశాలకు జడ్పీ నిధులను కేటాయించారని, అందుకు జడ్పీ ఛైర్మన్ను సన్మానిస్తే ఓర్వలేక బెదిరింపులకు దిగుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.
పోటీనే కాదు..వైరమేలా? : జడ్పీ ఛైర్మన్ అధికార పార్టీలో సీనియర్ నేత. ఆయన విధేయతకు చాలాకాలం తర్వాత పదవి దక్కింది. రానున్న రోజుల్లో ఆయన ఏ పదవి ఆశిస్తున్నారు? పార్టీలో ఏ స్థానాన్ని కోరుకుంటున్నారనే విషయాలపై చర్చే లేదు. ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో బలమైన నాయకుడు. వీరి ఇద్దరి మధ్య వచ్చే ఎన్నికల్లో సీటు విషయంలో పీటముడి పరిస్థితుల్లేవు. కానీ, ఎందుకు వైరం ఉందనే చర్చ సొంత పార్టీలోనే సాగుతోంది. చిన్నపాటి భేదాభిప్రాయాలే వీరి మధ్య దూరాన్ని పెంచాయని కార్యకర్తలు పేర్కొంటున్నారు. నేతలిద్దరు సమన్వయం చేసుకోలేకపోవడం వల్లే తాము నలిగిపోవాల్సి వస్తోందని ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు.
రాజకీయ వర్గాల్లో చర్చ.. : రాజకీయ పార్టీల్లో వర్గపోరు సహజమే. అంతర్గతంగా ఉన్నంత కాలం ఎవరూ పట్టించుకోరు. కానీ, సొంత పార్టీ వారే తమ నాయకుడిపై బహిరంగ ఆరోపణలు చేసే స్థాయికి చేరడం చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. గులాబీ దళపతి సైతం పార్టీ శ్రేణులకు పలు సందర్భాల్లో ఇదే విషయంలో దిశా నిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న వివాదాలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని, తప్పెవరిది? ఏ విషయంలో పొసగటం లేదనేది వారే తేల్చుకోవాలి? అని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్