16 కి.మీ.. నిత్యం ప్రమాదాలు
16 కి.మీ ఉన్న నిజామాబాద్-డిచ్పల్లి రహదారిలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించినా ప్రమాదాలు తగ్గుముఖం పట్టట్లేదు. దీంతో రోడ్డు భద్రత జిల్లా కమిటీ నివారణ చర్యలు చేపట్టింది. కమిటీ ఛైర్మన్ పాలనాధికారి
న్యూస్టుడే - నిజామాబాద్ నేరవార్తలు
డిచ్పల్లి రోడ్డును పరిశీలిస్తున్న కమిటీ ప్రతినిధులు
16 కి.మీ ఉన్న నిజామాబాద్-డిచ్పల్లి రహదారిలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించినా ప్రమాదాలు తగ్గుముఖం పట్టట్లేదు. దీంతో రోడ్డు భద్రత జిల్లా కమిటీ నివారణ చర్యలు చేపట్టింది. కమిటీ ఛైర్మన్ పాలనాధికారి నారాయణరెడ్డి, వైస్ ఛైర్మన్ సీపీ నాగరాజు నిర్ణయం మేరకు ఆర్అండ్బి ఈఈ రాంబాబు, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రావు, డీఈ ప్రవీణ్ కుమార్, సీఐ రఘునాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కమిటీ సభ్యులు రహదారిని పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలను నివేదిక రూపంలో తయారుచేశారు.
వాహనదారుల నిర్లక్ష్యమే..
* ఈ మార్గంలో వరుస ప్రమాదాలకు వాహనదారుల నిర్లక్ష్యం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అతివేగం, తప్పుడు మార్గంలో ప్రయాణం, డివైడర్ల వద్ద ఇష్టారాజ్యంగా రోడ్లు దాటడం వంటివి చేస్తున్నారు.
* పెట్రోల్ బంకులు, ఇనిస్టిట్యూట్లు ఉన్న చోట డివైడర్లను ప్రత్యేకంగా తెరిచారు. వీటి వద్ద వాహనదారులు ఒక్కసారిగా వాహనాలను మలుపుతుండడం ప్రమాదాలకు దారి తీస్తోంది.
* గతంతో పోలిస్తే రోడ్డు మెరుగుపడినా ఇప్పటికీ రాత్రివేళ పలు చోట్ల వీధి దీపాల వ్యవస్థ లేదు. ఇటీవల సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినా ఇంకా ప్రారంభించలేదు. సత్వరమే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సూచించింది.
* 16 కి.మీ. దారిలో రోడ్డుకు ఇరువైపులా ఐదారు గ్రామాలకు వెళ్లేందుకు అనుసంధాన రహదారులు ఉన్నాయి. ఆయా మార్గాల నుంచి వాహనదారులు రోడ్డుపైకి వేగంగా వస్తున్నారు.
* ధర్మారంలో ఓ మూలమలుపు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు