logo

అంగన్‌వాడీలకు సెలవులు ఇవ్వాలి..

అంగన్‌వాడీలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించాలని అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ప్రతినిధులు జిల్లా సంక్షేమాధికారిణి సరస్వతికి బుధవారం వినతిపత్రం అందజేశారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న

Published : 20 Jan 2022 02:40 IST

సంక్షేమాధికారిణికి వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ ప్రతినిధులు

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించాలని అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ప్రతినిధులు జిల్లా సంక్షేమాధికారిణి సరస్వతికి బుధవారం వినతిపత్రం అందజేశారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించినా అంగన్‌వాడీలు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌, కొత్త నర్సింలు, జ్యోతి, స్వాతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని