చిత్రవార్తలు
ఇప్పటి వరకు అంతటా కూరగాయలు, పశువుల అంగళ్లు చూసుంటారు. ద్విచక్ర వాహనాల సంత చూడాలంటే మాత్రం కామారెడ్డికి వెళ్లాల్సిందే. జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ మైదానంలో ప్రతి గురువారం దీన్ని నిర్వహిస్తుంటారు. 200 నుంచి 300
అవునండి.. ద్విచక్ర వాహనాల అంగడి
ఇప్పటి వరకు అంతటా కూరగాయలు, పశువుల అంగళ్లు చూసుంటారు. ద్విచక్ర వాహనాల సంత చూడాలంటే మాత్రం కామారెడ్డికి వెళ్లాల్సిందే. జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ మైదానంలో ప్రతి గురువారం దీన్ని నిర్వహిస్తుంటారు. 200 నుంచి 300 వరకు సెకండ్ హ్యాండ్ బండ్ల క్రయవిక్రయాలు జరుగుతాయి. మోడల్, ధర తదితర పూర్తి వివరాలు ప్రదర్శిస్తూ విక్రయిస్తుంటారు.
- ఈనాడు, నిజామాబాద్
వేసి.. ఎన్నాళ్లో?
కోటగిరి మండలంలో రోడ్లు శిథిలమై నరకం చూపుతున్నాయి. ఏళ్ల కిందట వేసిన తారురోడ్లు నేడు నామరూపాల్లేకుండా పోయాయి. మోకాలి లోతు గుంతలు పడి కంకర తేలాయి. కారేగాం-సుంకిని, కల్లూర్-కొడిచర్ల, కోటగిరి-రాంపూర్ మార్గాల్లో ద్విచక్ర వాహనాలు వెళ్లేలేని దుస్థితి. కనీసం పాదచారులు వెళ్లేందుకు సాహసించడంలేదు. రాత్రివేళల్లో వెళ్లేవారు గుంతల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. కనీసం మొరంపోసి తాత్కాలిక మరమతు పనులైనా చేయాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.
- న్యూస్టుడే, కోటగిరి
కలెక్టరేట్లో కట్టడి
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కట్టడి చర్యలు చేపట్టారు. ప్రధాన ద్వారంతోపాటు ప్రగతిభవన్ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. సిబ్బందిని తప్ప ఇతరులను లోనికి అనుమతించడం లేదు. అర్జీదారుల సౌకర్యార్థం బయట ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేశారు.
- న్యూస్టుడే, నిజామాబాద్ కలెక్టరేట్
80 టైర్లతో చకచకా..
డిచ్పల్లి పరిధి జాతీయ రహదారిపై గురువారం 80 టైర్ల ట్రాలీపై తరలుతున్న భారీ యంత్రం చూపరులను ఆశ్చర్యపరిచింది. గుజరాత్లో తయారైన దీన్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు తరలిస్తున్నట్లు లారీ చోదకుడు తెలిపారు.
- ఈనాడు, నిజామాబాద్
కొనితెచ్చుకోవొద్దు ముప్పు
కరోనా మొదటి, రెండో దశలో దుకాణాలు, మార్కెట్లు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాల వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ముగ్గుతో గడులు గీసి వరుస క్రమం పాటించేలా చేసేవారు. ఇవి పాటించని దుకాణదారులకు పుర, గ్రామాధికారులు జరిమానాలు విధించారు. ప్రస్తుతం అలాంటి చర్యలేవీ కనిపించడం లేదు. జనం ఎక్కడా భౌతికదూరం పాటించట్లేదు. దుకాణాల్లో శానిటైజర్ ఉంచడం లేదు. కామారెడ్డి అశోక్నగర్ కూరగాయల మార్కెట్లో గురువారం దేశ్పాండే ఫౌండేషన్ ప్రతినిధులు విక్రయాలు జరిగే చోట ముగ్గు వేసి అవగాహన కల్పించారు. రైతులకు మాస్కులు పంపిణీ చేశారు.
- న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203