logo

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి.. వృద్ధుడి ఆత్మహత్య

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకొన్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు కథనం ప్రకారం.. నగరంలోని మిర్చికాంపౌండ్‌లో

Published : 21 Jan 2022 03:35 IST

మృతుడు రాములు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకొన్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు కథనం ప్రకారం.. నగరంలోని మిర్చికాంపౌండ్‌లో నివాసం ఉంటున్న బక్కొళ్ల రాములు(70) స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేసేవారు. మూడ్రోజుల కిందట ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. భోజనం కోసం కుటుంబీకులు ఇంటికి వెళ్లగా.. మూడో అంతస్తు నుంచి దూకి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని