‘రాష్ట్రంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించాం’
ఉద్యోగ కల్పనపై కేంద్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. కమ్మర్పల్లిలో రూ.2.50 కోట్ల నిధులతో నిర్మించిన క్రీడా మైదానాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
కమ్మర్పల్లిలో మినీస్టేడియాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ప్రశాంత్రెడ్డి
కమ్మర్పల్లి, న్యూస్టుడే: ఉద్యోగ కల్పనపై కేంద్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. కమ్మర్పల్లిలో రూ.2.50 కోట్ల నిధులతో నిర్మించిన క్రీడా మైదానాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా రాష్ట్ర నాయకులు అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ కృషితో రాష్ట్రంలో యువతకు 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని నిరూపించడానికి తాను సిద్ధమన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇన్ని ఉద్యోగాలిచ్చారా? అని ప్రశ్నించారు. కమ్మర్పల్లి గ్రామస్థుల చిరకాల స్వప్నమైన స్టేడియాన్ని ఏర్పాటు చేయడం తనకు అమితమైన సంతోషాన్ని కలిగించిందన్నారు. అంతకుముందు ఉన్నత పాఠశాలలో రూ.35 లక్షలతో చేపట్టిన అదనపు గదులు, రూ.50 లక్షలతో గ్రామంలో చేపట్టిన సీసీ మురుగుకాల్వలు, పాటి హనుమాన్ ఆలయంలో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఎంపీపీ గౌతమి, జడ్పీటీసీ సభ్యురాలు రాధ, సర్పంచి స్వామి, ఎంపీటీసీ సభ్యుడు సుధాకర్, భాస్కర్యాదవ్, రేగుంట దేవేందర్, బద్దం రాజశేఖర్, లుక్క గంగాధర్, సుమన్, రఘు, రాజాగౌడ్, చిన్నారెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!