logo

కిషోరబాలికలకు పోటీలు

జాతీయ బాలికల వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరబాలికలకు

Updated : 22 Jan 2022 17:36 IST

బీర్కూర్‌: జాతీయ బాలికల వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరబాలికలకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో అనురాధ.. కిషోరబాలికలకు బాల్య వివాహాలు, విద్యా హక్కు చట్టాలు, టోల్‌ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు కళావతి, లక్ష్మి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు శివజ్యోతి, నాగమణి, లలిత, వనిత, హారిక పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని