వాషింగ్మిషన్లో వనదుర్గమ్మ సొత్తు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ నెల 19న గుర్తు తెలియని వ్యక్తి గర్భగుడిలోకి చొరబడి నగలు, సొత్తు ఎత్తుకెళ్లడంతో మూడు పోలీసు బృందాలు
శీలంపల్లిలోని అత్తగారింట్లో దాచిన చోరుడు
న్యూస్టుడే, మెదక్, చిలప్చెడ్
పనిచేయని వాషింగ్ మిషన్ నుంచి సంచి తీస్తున్న పోలీసులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ నెల 19న గుర్తు తెలియని వ్యక్తి గర్భగుడిలోకి చొరబడి నగలు, సొత్తు ఎత్తుకెళ్లడంతో మూడు పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు శనివారం మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం శీలంపల్లిలో చోరీకి గురైన సొత్తును గుర్తించారు. మొత్తం రూ.2.36 లక్షలతో పాటు పుస్తెలతాడు, వెండి, బంగారు నగలు, ఐదు కొత్త చరవాణులు లభ్యమయ్యాయి. దొంగతనం చేసింది కామారెడ్డి జిల్లా ఆత్మకూరుకు చెందిన లక్ష్మారెడ్డిగా తేల్చారు. మెదక్ డీఎస్పీ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా శనివారం ఉదయం కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిందితుడి అత్తగారి ఊరు చిలప్చెడ్ మండలం శీలంపల్లికి వెళ్లింది. గ్రామానికి చెందిన కొమ్మన్నగారి బాల్రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టగా ఐదు చరవాణులు, పుస్తెలతాడు లభించాయి.
ఎవరికీ అనుమానం రాకుండా..
మళ్లీ ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎదురుగా చెడిపోయి ఉన్న వాషింగ్ మిషన్ను తెరిచి చూడగా ఓ సంచి లభించింది. అందులో చోరీ సొత్తును గుర్తించారు. మొత్తం రూ.2.36 లక్షలు, ఆభరణాలు లభించాయి. నిందితుడి పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.
జల్సాగా తిరుగుతూ..
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన లక్ష్మారెడ్డికి చిలప్చెడ్ మండలం శీలంపల్లికి చెందిన కొమ్మన్నగారి ప్రవీణతో వివాహమైంది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రవీణకు పక్షవాతం రావడంతో ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు లక్ష్మారెడ్డి జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లినట్లు తెలిపారు. సుమారు ఆరేళ్ల తర్వాత శీలంపల్లికి వచ్చినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్థులు పోలీసులకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.