ఆటో, బస్సు ఢీ
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర వద్ద శనివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేల్పూర్ ఎస్సై రాజ్భరత్రెడ్డి కథనం ప్రకారం..
అత్త, అల్లుడి మృతి
మరొకరికి తీవ్రగాయాలు
బస్సు ఢీకొన్న ఘటనలో నుజ్జునుజ్జైన ఆటో
వేల్పూర్, న్యూస్టుడే: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర వద్ద శనివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేల్పూర్ ఎస్సై రాజ్భరత్రెడ్డి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఏకలవ్య కాలనీకి చెందిన అంగడి పోసాని (60), ఆమె అల్లుడు లొకిడి తిరుపతి (40) అంకాపూర్ మార్కెట్లో కూరగాయలు కొని తమ పట్టణంలో విక్రయిస్తుంటారు. అందులో భాగంగానే కమ్మర్పల్లి మండలం నాగపూర్కు చెందిన్ బానోత్ నాందేవ్ ఆటోను మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి వేరుసెనగ కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. లక్కోర వద్దకు వీరి ఆటో చేరుకోగానే.. ఆర్మూర్వైపు వెళ్తున్న వరంగల్-1 డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఆటో పైభాగం ఊడిపోవడంతో పాటు నుజ్జునుజ్జైంది. ముందు కూర్చున్న తిరుపతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. చేయి తెగి రక్తమోడుతున్న పోసానిని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ నాందేవ్ను నిజామాబాద్లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్, ఎస్సై రాజ్భరత్రెడ్డి పరిశీలించారు. తిరుపతి భార్య ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతిచెందిన తిరుపతి, పోసాని
ఔదార్యం చాటుకున్న సర్పంచి
లక్కోర సర్పంచి వంశీకృష్ణ కొన ఊపిరితో ఉన్న పోసానిని, తీవ్రంగా గాయపడిన బానోతు నాందేవ్ను తన కారులో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం అందిస్తుండగానే పోసాని మృతి చెందారు. నాందేవ్ను వారి బంధువులు నిజామాబాద్ తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!