logo

ఫిబ్రవరి 5 వరకు లబ్ధిదారుల ఎంపిక

జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపికను ఫిబ్రవరి 5 వరకు పూర్తి చేస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు.

Published : 23 Jan 2022 04:19 IST


వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపికను ఫిబ్రవరి 5 వరకు పూర్తి చేస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి సకాలంలో ఎంపిక పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, డీఆర్డీవో వెంకట మాధవరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, షెడ్యూల్‌ కులాల సంక్షేమాధికారిణి రజిత, గిరిజనాభివృద్ధి అధికారి అంబాజీ, మహిళా, శిశుసంక్షేమాధికారిణి సరస్వతి, వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి, డీసీవో వసంత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని