ఆస్తుల విలువ మదింపు
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువ అధికారికంగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని భూముల విలువ మదింపులో అధికారులు తలమునకలయ్యారు.
జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువ అధికారికంగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని భూముల విలువ మదింపులో అధికారులు తలమునకలయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా నివేదించనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నతస్థాయి అధికారులు అన్ని జిల్లాల రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఐదు కార్యాలయాల పరిధిలో ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలు, తాజాగా పెంచాల్సిన వాటిని మదింపు చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పెంపు ప్రతిపాదనలు ఇలా..
* ఎకరం వ్యవసాయ భూమికి ప్రస్తుతం అమల్లో ఉన్న ధరపై 50శాతం అదనంగా విలువ పెరగనుంది.
●* ఇదే విధంగా వ్యవసాయేతర భూములకు తాజా ప్రతిపాదనల మేరకు ఖాళీ స్థలాలకు చదరపు గజానికి ప్రస్తుతం ఉన్న ధరపై 35శాతం పెంచనున్నారు.
* చదరపు గజం రూ.వెయ్యి ఉంటే తాజా ప్రతిపాదనల మేరకు రూ.1350కి పెరుగుతుంది. అపార్టుమెంట్లలోని ఫ్లాట్లకు చదరపు అడుగుకు ఇప్పుడున్న మూల ధరపై రూ.25 శాతం పెంచనున్నారు.
ఎలా నిర్ణయిస్తారంటే
ప్రస్తుతం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న తంతు ప్రాథమిక దశ మాత్రమే. వ్యవసాయంతో పాటు ఇతర భూముల మార్కెట్ విలువను నిర్ణయించేందుకు రిజిస్ట్రేషన్లశాఖ, పట్టణ, గ్రామీణ స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవోలు నేతృత్వం వహిస్తారు. సబ్ రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. వీరు స్థానిక బిల్డర్లు, రియల్టర్లు, ఇతర నిర్మాణరంగ ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకుంటారు. అనంతరం ఎంతమేరకు పెంచవచ్చో ప్రభుత్వానికి నివేదిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు సమీక్షించి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు సీఎంకు నివేదిక అందజేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం