logo

ప్రతి సభ్యుడికి ప్రమాద బీమా

కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ కలిగిన ప్రతిఒక్క సభ్యుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. మాచారెడ్డి, రామారెడ్డి మండలాల బూత్‌ స్థాయి సమన్వయ....

Published : 24 Jan 2022 04:08 IST


కార్యకర్తలను సన్మానిస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ

మాచారెడ్డి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ కలిగిన ప్రతిఒక్క సభ్యుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. మాచారెడ్డి, రామారెడ్డి మండలాల బూత్‌ స్థాయి సమన్వయ కార్యకర్తలతో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన భూములు లాక్కొని దిక్కులేని వారిని చేస్తోందని ఆరోపించారు. భాజపా, తెరాస పార్టీలు రహస్య ఒప్పందాలతో జీవో 317ను తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని 20 వేల మందికి సభ్యత్వం చేయించినట్లు తెలిపారు. అధిక మందిని చేర్పించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ మోహన్‌రెడ్డి, మండల, గ్రామాధ్యక్షులు గణేశ్‌నాయక్‌, భాస్కర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని