దర్శనీయ స్థలాల నెలవు.. ఇందూరు
ఉమ్మడి జిల్లాలో సందర్శనీయ స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆహ్లాదంగా గడిపే ప్రాంతాలు, ఎత్తైన కొండలు, జల సవ్వడుల ప్రాజెక్టులకు కొదువ లేదు. కానీ, పర్యాటకంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయాయి.
పట్టింపులేక అభివృద్ధికి దూరంగా..
నేడు జాతీయ పర్యాటక దినోత్సవం
ఉమ్మడి జిల్లాలో సందర్శనీయ స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆహ్లాదంగా గడిపే ప్రాంతాలు, ఎత్తైన కొండలు, జల సవ్వడుల ప్రాజెక్టులకు కొదువ లేదు. కానీ, పర్యాటకంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయాయి. నిధులు కేటాయించి వీటిని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారిస్తే.. బొగత, కుంటాల, లక్నవరం, రామప్ప, వేయిస్తంభాల గుడి, నాగార్జునసాగర్ వంటి చారిత్రక ప్రదేశాలకు ఏమాత్రం తీసిసోవు.
సిద్ధుల గుట్ట.. ఎంతో ప్రత్యేకం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట, భీమ్గల్ లింబాద్రి గుట్ట, బడా పహాడ్ తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలు ప్రకృతి అందాలకు నెలవైన ప్రదేశాలు. వీటిని దర్శించేందుకు పండుగల సందర్భంగా వేలల్లో భక్తులు వస్తుంటారు. సాధారణ సమయాల్లోనూ సందర్శకులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటారు. సిద్ధులగుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి రూ.8 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇది వరకే నిర్మించిన పిల్లల పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్ది, ప్రకృతి అందాలను తిలకించేందుకు వ్యూ పాయింట్ను ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. పట్టణ సొగసును తమ చిత్రాల్లో బంధించేందుకు ఫొటో షూట్ల పేరుతో కొత్త జంటలు, యూట్యూబర్లు, సినీ దర్శక, నిర్మాతలు వస్తున్నారు. భీమ్గల్లో లింబాద్రి గుట్టపై నిర్వహించే రథోత్సవాన్ని తిలకించేందుకు లక్షల మంది భక్తులు వస్తుంటారు. విశాలమైన స్థలం ఉంటుంది. ఇక్కడ 50 ఎకరాల్లో పార్కు, పర్యాటకులు బస చేసేందుకు కాటేజీలు నిర్మించొచ్చు. ఇక్కడ దట్టమైన అటవీప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వసతులు కల్పిస్తే పర్యాటకులు మరింత మంది వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గుట్టపైకి రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి.
సారంగపూర్ హనుమాన్ దేవాలయం
బోటింగ్ కేంద్రాలు..
ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులున్నాయి. గతంలో నిజాంసాగర్లో బోటింగ్ సదుపాయం ఉన్నా.. కొన్నిరోజులకే సేవలను ఎత్తేశారు. అలీసాగర్, అశోక్ సాగర్లో బోటింగ్ సౌకర్యం ఉంది. రూర్బన్ పథకం కింద అలీసాగర్లో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు, మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఎస్సీరెస్పీకి వచ్చే పర్యాటకుల కోసం పార్కు మాత్రమే ఉంది. బోటింగ్ సదుపాయం లేదు. ఇక్కడ వసతులు కల్పిస్తే ఏడాదంతా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. నిజామాబాద్నగరంలో రఘునాథ ఆలయం, డిచ్పల్లి ఖిల్లా రామాలయం, సిర్నాపల్లి జానకీబాయి చెరువు, రాళ్లవాగు, సారంగపూర్ హనుమాన్ మందిరం, కౌలాస్ కోట, పోచారం ప్రాజెక్టు, దోమకొండ కోట పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అయితే ఇక్కడ చొప్పుకోదగ్గ వసతులు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్