అర్హత వస్తే నిర్ణేతలే
ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరి పాలన కావాలో నిర్ణయించుకునే అధికారాన్ని ఓటు హక్కు కల్పిస్తోంది. దాన్ని పొందడానికి గతంలో ఉన్న మూస విధానాలకు ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. ప్రజల వద్దకే పాలన
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్
ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరి పాలన కావాలో నిర్ణయించుకునే అధికారాన్ని ఓటు హక్కు కల్పిస్తోంది. దాన్ని పొందడానికి గతంలో ఉన్న మూస విధానాలకు ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. ప్రజల వద్దకే పాలన అన్నట్లు వారే తమ హక్కును నిర్ధారించుకునే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. సమాచార సాంకేతిక విప్లవాన్ని అన్వయించుకుని యాప్లు, వెబ్సైట్ ద్వారా ఓటు నమోదుకు శ్రీకారం చుడుతోంది. వీటిపైనా ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపించడం చైతన్యలేమికి అద్దం పడుతోంది. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈసీ ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు తీరుపై కథనం..
అరచేతిలో నిక్షిప్తం
అభిమాన నాయకుడిని ఎన్నుకొనేందుకు ఓటు హక్కు దోహదం చేస్తోంది. అంతటి విలువైన హక్కు పొందడానికి గతంలో ఎంతో కష్టమయ్యేది. చివరికి ఓటేసే రోజు జాబితాలో పేరు లేక నానా అవస్థలు పడ్డారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం పలు సదుపాయాలు కల్పించింది. voterhelpline యాప్, voterportaleci.gov.in, nvsp.in అనే వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారులు ఓటరును ధ్రువీకరించడానికి గరుడ యాప్ను ప్రవేశపెట్టారు. స్మార్ట్యుగంలో అందరి చేతిలో చరవాణి ఉంది. ఈ అప్లికేషన్ల ద్వారా వివరాలు నమోదు చేసుకోవడం, పేర్లు సరిచూసుకోవడం, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం, తప్పులు సవరించుకోవడం వంటివి స్వయంగా చేసుకోవచ్చు. అధికారులే ఇంటికొచ్చి వివరాలు సరిచూసుకుని ఓటుహక్కును ధ్రువీకరిస్తారు.
సద్విమర్శగా భావిస్తే.. భావిస్తే..
ప్రతి ఎన్నికల సమయంలో జాబితాలో తమ పేర్లు లేవని, తప్పులున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తాయి. అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తారు. వీటిని సద్విమర్శగా భావించి ఎన్నికల అనంతరం వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సవరిస్తే మేలు జరగనుంది. అందుకు కొప్పర్గ బీఎల్వో అనిత పాటించిన తీరును అన్వయించుకోవాలి. ఈసీ నిర్దేశించిన గడువులో బూత్స్థాయిలో సవరణలు చేసి దోష రహితంగా జాబితా రూపొందించాలి. ప్రజలు ఎన్నికల సమయంలోనే కాకుండా ఈసీ ప్రకటించిన షెడ్యూలు సమయంలో తమ పేర్లు సరిచూసుకోవడంపై దృష్టి సారించాలి. వందలాది ఓటర్ల వివరాలను క్రోడీకరించే సమయంలో తప్పులు దొర్లడం సహజం. ఈ విషయంలో అధికారులను ఎంతగా బాధ్యులను చేస్తామో అంతే నిబద్ధత ఓటరుపైనా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.
30-39 వయసు ఓటర్లే కీలకం
యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్కు పేరుంది. అందుకు తగ్గట్లే పనిచేసే శక్తి ఉన్నవారి సంఖ్య అధికమని ఉభయ జిల్లాల ఓటరు జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. నమోదైన ఓటరు జాబితాలో 30-39 వయసున్న వారే అధికంగా ఉన్నారు. ఆ తర్వాత 20-29 ఏళ్ల వారు ఎక్కువ. అంటే దాదాపుగా సగం ఓటర్లు యువతేనన్నది గుర్తెరగాలి. ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. అదే విధంగా ఉభయ జిల్లాలోనూ మహిళా ఓటర్లే అధికం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM