నారీమణులకు జనరిక్ దుకాణాలు
తక్కువ ధరకే పేద ప్రజలకు జనరిక్ ఔషధాలు అందించి వైద్య ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఔషధి పథకం ద్వారా దేశంలో పలుచోట్ల ఈ మందుల దుకాణాలు ఏర్పాటు చేశారు.
స్త్రీనిధి ద్వారా రుణ సదుపాయం
డిచ్పల్లిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జనరిక్ ఔషధి మందుల దుకాణం
న్యూస్టుడే, బీర్కూర్ : తక్కువ ధరకే పేద ప్రజలకు జనరిక్ ఔషధాలు అందించి వైద్య ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఔషధి పథకం ద్వారా దేశంలో పలుచోట్ల ఈ మందుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు మందుల ఖర్చులు తగ్గించేందుకు స్త్రీనిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయించేందుకు రుణాలు అందిస్తోంది. ఇప్పటికే ఐకేపీ, మెప్మా అధికారులు గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకొంటున్నారు.
విధి విధానాలు
స్వయం సహాయక సంఘంలో సభ్యురాలై ఉండాలి. సభ్యురాలి కుమార్తె, కొడుకు, వీరి బంధువులు డీఫార్మసీ, బీఫార్మాసీ, ఎంఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.
* తొలుత సంఘం, గ్రామ సంఘాల తీర్మానం పత్రం తీసుకోవాలి. సభ్యురాలి ఆధార్కార్డు, డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా ధ్రువీకరించిన అనుమతి పత్రం, కొటేషన్, దరఖాస్తుదారు విద్యార్హత పత్రాలు జతచేసి మండల కేంద్రాల్లో ఐకేపీ, పట్టణాల్లో మెప్మా, స్త్రీనిధి అధికారులకు అందజేయాలి. వారు దరఖాస్తుదారుల వివరాలను స్త్రీనిధి వెబ్సైట్లో నమోదు చేస్తారు
* జనరిక్ మందుల దుకాణం ఏర్పాటుకు సభ్యురాలికి యూనిట్ కింద రూ.3 లక్షల రుణం అందజేస్తారు. ఇందులో ఎలాంటి రాయితీ ఉండదు. మంజూరైన రుణం గ్రామ సంఘం ఖాతాల్లో నుంచి సభ్యురాలి వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తారు. ఈ దుకాణాన్ని సొంత లేదా అద్దె 120 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి.
* మొత్తం రుణం రూ.3,09,450. ఇందులో సభ్యురాలు ఐదేళ్ల వరకు రూ.3450 స్త్రీనిధి ద్వారా బీమా ప్రీమియం చెల్లిస్తారు. లోన్ లింక్డ్ షేర్ క్యాపిటల్ కింద రూ.6 వేలు చెల్లిస్తారు. సభ్యురాలి చేతికి రూ.3 లక్షల రుణం మాత్రమే వస్తుంది.
* తీసుకున్న రుణాన్ని ప్రతినెల రూ.6728 కిస్తీగా చెల్లించాలి. 60 నెలల వాయిదాలో చెల్లించాలి.
దరఖాస్తు చేసుకోవాలి
డ్వాక్రా సంఘాల్లో అర్హులైన మహిళల పిల్లలు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకొనేందుకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి. పేద ప్రజలకు బ్రాడెండ్ మందులతో సమానంగా పని చేసే జనరిక్ మందులను తక్కవ ధరకు అందించడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేయిస్తున్నాం.
- రవికుమార్, స్త్రీనిధి జోనల్ మేనేజర్, కామారెడ్డి జిల్లా
* కామారెడ్డి జిల్లాలో ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలు 21,176 ఉండగా 2,17,593 మంది సభ్యులున్నారు.
* ఉమ్మడి జిల్లాలో జనరిక్ ఔషధి మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆరు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
* నిజామాబాద్ జిల్లాలో ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలు 34,973 ఉండగా, 3,73,437 మంది సభ్యులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ సభ్యులు
[ 18-04-2024]
తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. -
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్