logo

గుంతలున్నాయ్‌... గంతలు తీయండి..

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలు వాహనదారులను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. దగ్గరికొచ్చే వరకు కనిపించకపోవడంతో వాహనాన్ని అదుపు చేయలేక కిందపడుతున్నారు. ఆదివారం

Published : 25 Jan 2022 03:12 IST

తిలక్‌గార్డెన్‌ చౌరస్తాలో..

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలు వాహనదారులను ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. దగ్గరికొచ్చే వరకు కనిపించకపోవడంతో వాహనాన్ని అదుపు చేయలేక కిందపడుతున్నారు. ఆదివారం ఉదయం ఆర్పీ రోడ్డులోని మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో గుంతే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మురుగు కాలువలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతుల కోసం రోడ్లు తవ్విన తర్వాత సరిగా పూడ్చడం లేదు. దీంతో అవి గుంతలుగా మారుతున్నాయి. ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు ఇకనైనా స్పందించి వాటిని పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.

- ఈనాడు, నిజామాబాద్‌

ఆర్పీరోడ్డులో..

కుమార్‌గల్లి చౌరస్తాలోని రోడ్డుపై...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని