ఇందూరు గడ్డపై.. పద్మజారెడ్డి నాట్యస్ఫూర్తి
అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి చిన్న కోడలు, డాక్టర్ జి.పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కాకతీయం అనే సరికొత్త
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం
ఇందూరు ఉత్సవాల్లో పద్మజారెడ్డి నృత్య ప్రదర్శన
అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి చిన్న కోడలు, డాక్టర్ జి.పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కాకతీయం అనే సరికొత్త నృత్యరూపకాన్ని ఆవిష్కరించారు. ఆమె స్ఫూర్తితో జిల్లాకు చెందిన పలువురు కళాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాట్యప్రదర్శనలు ఇచ్చి కీర్తిని ఇనుముడింపజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఇందూరుతో నాట్య అనుబంధంపై కథనం.
ఇందూరు ఉత్సవాల్లో..
2003లో అప్పటి కలెక్టర్ అశోక్కుమార్ నేతృత్వంలో మొదటిసారిగా వారం రోజుల పాటు ఇందూరు ఉత్సవాలు నిర్వహించారు. పద్మజారెడ్డి నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో నాట్యప్రదర్శన ఇచ్చారు. 2004లో రెండోసారి ఇందూరు ఉత్సవాల వేదికపై నర్తించారు. తర్వాత 2007లో నిజామాబాద్ శతాబ్ది ఉత్సవాల్లో మరోసారి ఇదే వేదికపై నృత్యరూపకం ప్రదర్శించారు. 2010లో చారిత్రక ఖిల్లా రఘునాథాలయ ప్రాంగణంలో గుడి నృత్యం పేరుతో ప్రత్యేక రూపకాన్ని ఆవిష్కరించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వేల ప్రదర్శనలు ఇచ్చి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వీరి బృందంలో జిల్లాకు చెందిన యువ కళాకారిణి శ్రీదేవి పాల్గొన్నారు. అమెరికాలోని అట్లాంటాలో 2012లో జరిగిన ‘నమస్తే ఇండియా’ నృత్యరూపకంలో నర్తించారు. కూచిపూడి నాట్యాచార్యుడు ప్రశాంత్కుమార్ తన శిష్యులను పద్మజారెడ్డి నుంచి ప్రేరణ పొందేలా తీర్చిదిద్దారు.
మోహినీ అట్టం..
- యువ కళాకారిణి శ్రీదేవి(అమెరికా నుంచి)
నేను చిన్నప్పటి నుంచి శాస్త్రీయనృత్యంలో శిక్షణ పొంది రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలు ఇచ్ఛా తర్వాత పెళ్లి కావడంతో మొదట లండన్కు, తర్వాత అమెరికా వచ్చాను. అంతకుముందు ప్రముఖ నాట్యకారిణి పద్మజారెడ్డి బృందంలో సభ్యురాలిని. 2012లో అమెరికా అట్లాంటాలో జరిగిన ఆటా ఉత్సవాల వేదికపై మేడంతో కలిసి నేను మోహినీఅట్టం నాట్యం చేశా. ఎప్పటికీ మరిచిపోలేని ప్రదర్శన అది. ఆమెకు పద్మశ్రీ పురస్కారం రావడం సంతోషంగా ఉంది.
బాలభవన్ చిన్నారులకు..
- ప్రశాంత్కుమార్, నాట్యాచార్యులు
నాట్యకళపై పద్మజారెడ్డికి ఉన్న ఆసక్తి ఎందరికో స్ఫూర్తినిస్తుంది. నాట్య ప్రదర్శనలో వారి ప్రయోగాలు నాకు ఎంతో ఇష్టం. అవి చూసి నేనూ పలు నృత్య రూపకాల్లో వైవిధ్యంగా రూపొందించా. ఆమె గతంలో జిల్లా బాలభవన్ చిన్నారుల ప్రదర్శనలకు అవసరమైన ఆభరణాలు, దుస్తుల కోసం ఆర్థిక సాయం అందించారు. మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఇందూరు కళాకారులు కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!