జీవన్రెడ్డికి తెరాస జిల్లా బాధ్యతలు
ఆర్మూర్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వరంగ సంస్థల కార్పొరేషన్ ఛైర్మన్గా ఉన్న ఆశన్నగారి జీవన్రెడ్డికి తెరాస అధిష్ఠానం మరో బాధ్యత అప్పగించింది. ఆయన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా
తెరాస జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిని హైదరాబాద్లో
అభినందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు, నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వరంగ సంస్థల కార్పొరేషన్ ఛైర్మన్గా ఉన్న ఆశన్నగారి జీవన్రెడ్డికి తెరాస అధిష్ఠానం మరో బాధ్యత అప్పగించింది. ఆయన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. వరుసగా రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీలో తొలినాటి నుంచి కొనసాగుతున్న ఈయన, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తెరాస యువజన విభాగానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగారు. 2013లో ఉద్యమం జోరుగా సాగుతున్న సందర్భంలో జిల్లాకు వచ్చిన కేసీఆర్, జీవన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి అంటూ ముందస్తుగా ప్రకటించారు. ఆ మేరకు జిల్లాలో మొదటి సీటు ఆర్మూర్ నుంచే ఖాయం చేశారు.
పార్టీ బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాను. సహచర శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తాను. త్వరలోనే పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిపిస్తాం. రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తాం. నా నియామకంలో సహకరించిన మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్