logo

ఒంటరితనం.. అనారోగ్య సమస్యలు

నగరంలోని ప్రగతినగర్‌ రోడ్డులో బుధవారం ఉదయం దారుణం చోటు చేసుకొంది. యెండల టవర్స్‌లో నివసిస్తున్న ఓ వృద్ఢుడు ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

Published : 27 Jan 2022 05:05 IST

ఐదో అంతస్తు నుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని ప్రగతినగర్‌ రోడ్డులో బుధవారం ఉదయం దారుణం చోటు చేసుకొంది. యెండల టవర్స్‌లో నివసిస్తున్న ఓ వృద్ఢుడు ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగో ఠాణా ఎస్సై సందీప్‌ కథనం ప్రకారం.. ఐదో అంతస్తు 508 ఫ్లాట్‌లో యెండల గంగాధర్‌(81) కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు. ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపార్ట్‌మెంటు వాసులు సమాచారం ఇవ్వడంతో నాలుగో ఠాణా పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణకు గంగాధర్‌ బంధువు కావడంతో ఆయన ఘటనా స్థలానికి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని