మొక్కజొన్న కుప్పలు దగ్ధం
ప్రమాదవశాత్తు మొక్కజొన్న కుప్పలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని తుమ్మల్ల శివారులో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట వ్యర్థాలకు గుర్తు
కాలిపోయిన మక్క కంకులు
గాంధారి, న్యూస్టుడే: ప్రమాదవశాత్తు మొక్కజొన్న కుప్పలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని తుమ్మల్ల శివారులో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా గాలి వీయడంతో పక్కనే ఉన్న ఎండ్రియాల్ కిష్టయ్య ఎకరం విస్తీర్ణంలో పండిన మొక్కజొన్న కుప్పలు(దూడులు) మంగళవారం రాత్రి కాలిపోయాయి. రెవెన్యూ సిబ్బంది బాలయ్య పంచనామా నిర్వహించి రూ.60 వేల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
బెల్టు దుకాణాలపై ఆబ్కారీ అధికారుల దాడి
లింగంపేట, న్యూస్టుడే: శట్పల్లి, మెంగారం గ్రామాల్లో బెల్టు దుకాణాలపై బుధవారం ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. శట్పల్లిలో రామాగౌడ్, శివకుమార్, మెంగారంలో బాలాగౌడ్ అక్రమంగా బెల్టు దుకాణాలు నిర్వహిస్తుండడంతో సోదాలు నిర్వహించి 16 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు అబ్కారీ సీఐ రాధాకృష్ణారెడ్డి తెలిపారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బాల కార్మికుడికి విముక్తి కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో భవన నిర్మాణ పనిలో పనిచేస్తున్న ఓ బాలకార్మికుడికి పట్టణ సీఐ నరేష్ ఆధ్వర్యంలోని పోలీసులు బుధవారం విముక్తి కల్పించారు. కొమురయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఆలయంలో చోరీ రాజంపేట, న్యూస్టుడే: పొందుర్తి పెద్దమ్మ ఆలయంలోకి మంగళవారం రాత్రి దుండగులు చొరబడి హుండీలోని నగదు ఎత్తుకెళ్లినట్లు రాజంపేట ఎస్సై రాజు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 20 రోజుల క్రితం ఇదే గ్రామంలోని రెండిళ్లలో దొంగతనాలు జరిగాయి.
మొరం ట్రాక్టర్ల పట్టివేత ఎల్లారెడ్డి పురపాలిక, న్యూస్టుడే: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమంగా తరలిస్తున్న మూడు మొరం ట్రాక్టర్లను పట్టుకొని కార్యాలయానికి తరలించినట్లు ఆర్ఐ మహ్మద్ తెలిపారు. వాల్టా చట్టం కింద కేసు నమోదు చేసి జరిమానా విధించనున్నట్లు చెప్పారు.
ఎనిమిది చరవాణులు ఎత్తుకెళ్లిన దుండగులు
దోమకొండ, న్యూస్టుడే: దోమకొండ మండలం లింగుపల్లి శివారులో మంగళవారం రాత్రి కార్మికుల స్థావరాల్లోకి వచ్చిన దుండగులు ఎనిమిది మంది చరవాణులు ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా కంగ్తి ప్రాంతానికి చెందిన కార్మికులు ఇక్కడ చెరకు కోత పనులకు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు బాధితులు దోమకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
పోలీసుల స్పెషల్ డ్రైవ్
మాస్కులు ధరించని 40 మందిపై కేసులు
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణ సీఐ నరేష్ ఆధ్వర్యంలోని పోలీసులు బుధవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 40 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
[ 23-04-2024]
జిల్లాలో రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈఓ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 23-04-2024]
ధర్మారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మన పార్లమెంటు మహోన్నతం
[ 23-04-2024]
దేశమంతా సార్వత్రిక ఎన్నికల సంగ్రామంతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఫలితమెలా ఉంటుందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది -
పద..పార్టీ మారుదాం !
[ 23-04-2024]
రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కిందిస్థాయి క్రీయాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరు తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు. -
ఓటరే లక్ష్యం.. అస్త్రాలు సిద్ధం
[ 23-04-2024]
పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు -
12 లో ఫెయిల్ జీవితంలో గెలుపు
[ 23-04-2024]
పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణతే మైలురాయి కాదు. విద్యాలయాలకు వెళ్లకపోయినా దూర విద్యలోనూ డిగ్రీలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారున్నారు. పరిమిత వనరుల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
ఓటరు తీర్పు విభిన్నం..
[ 23-04-2024]
కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. -
వీడని వాన
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు వీడటం లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వరుసగా కురుస్తున్న వానలు అన్నదాతలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. -
బోధన్ - మహబూబ్నగర్ ప్యాసింజర్ రద్దు
[ 23-04-2024]
నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మహబూబ్నగర్ మధ్య నడిచే రైలును మే 16 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వు జారీ చేశారు -
2.30 లక్షల మె.ట.ధాన్యం కొనుగోలు
[ 23-04-2024]
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది -
కాంగ్రెస్ శ్రేణుల్లో హుషారు
[ 23-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా