ప్రైవేటులోనే ప్రసవాలు
ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఓ గ్రామంలో జ్వర సర్వే తీరును పరిశీలిస్తే ఆశా కార్యకర్త, ఏఎన్ఎం గతేడాది నివేదిక చూపారు. ఆర్మూర్లో టీకాల లక్ష్యం గురించి అడిగితే అరకొర సమాధానాలు చెప్పారు.
సర్కారు దవాఖానాల్లో తగ్గుదల
న్యూస్టుడే, నిజామాబాద్ వైద్యవిభాగం
ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఓ గ్రామంలో జ్వర సర్వే తీరును పరిశీలిస్తే ఆశా కార్యకర్త, ఏఎన్ఎం గతేడాది నివేదిక చూపారు. ఆర్మూర్లో టీకాల లక్ష్యం గురించి అడిగితే అరకొర సమాధానాలు చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందనడానికి ఇదే నిదర్శనం. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై అధికారులు పట్టించుకోవడం లేదు.
* కొవిడ్ కట్టడి, జ్వరసర్వే, టీకాలపై 24 గంటలు పనిచేస్తున్నామంటూ చెబుతున్న అధికారులు సర్కారు దవాఖానాల్లో ప్రసవాల గురించి సమీక్షలు నిర్వహించట్లేదు. ఫలితంగా ప్రైవేటులో ప్రసవాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులోనూ శస్త్రచికిత్సలు చేసి పేదలను దోచుకుంటున్నారు.
గతంలో ఇలా..
గతంలో పనిచేసిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ప్రభుత్వ వైద్యాశాలల్లో ప్రసవాలు పెంచేందుకు దృష్టి సారించారు. దానికి తోడు కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టడం కలిసొచ్చింది. ప్రత్యేకంగా కాల్సెంటర్ నడిపిస్తూ హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. రక్తహీనత ఉన్నవారిని ముందుగా గుర్తించి దవాఖానాకు వచ్చేలోగా రక్తం సిద్ధం చేసేవారు. జిల్లాలోని దాదాపు సగం పీహెచ్సీల్లో శస్త్రచికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పేదలు ప్రైవేటుకు వెళ్లకుండా, అప్పుల పాలు కాకుండా చూశారు. ఒక దశలో ఆయన్ని బదిలీ చేసేందుకు కొందరు ప్రైవేటు వైద్యులు ప్రయత్నించిన విషయం చర్చనీయాంశమైంది.
కొవిడ్ పేరుతో...
సాధారణంగా ప్రసవానికి వెళ్తే సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ప్యాకేజీ పేరుతో వసూలు చేస్తున్నారు. కొవిడ్ వచ్చిన గర్భిణులను పంపిస్తే కేసుకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఏజెంట్లకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అలాంటి వారి దగ్గర రూ.లక్ష ప్యాకేజీ తీసుకుంటున్నారు. ప్రైవేటులో సాధారణ ప్రసవమయ్యే అవకాశం ఉన్నా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు సమాచారం.
గ్రామాల్లో ఏజెంట్లు
ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ మూలకు చేరాయి. పీహెచ్సీల్లో డీజీవోలు, మత్తు వైద్యులు లేరని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. కేవలం సాధారణ ప్రసవాలకే పరిమితం చేశారు. ఇదే అదునుగా భావించిన పలు ప్రైవేటు ఆసుపత్రులకు చెందినవారు గ్రామస్థాయిలో కొందరు ఆశా కార్యకర్తలను, ఏఎన్ఎంలను ఏజెంట్లుగా నియమించుకున్నారు. కాన్పులకు ఆసుపత్రికి పంపించిన వారికి రూ.3000 నుంచి రూ.4000 అందజేస్తున్నారు. జిల్లా ఆసుపత్రికి వచ్చిన వారిని కూడా పలువురు స్థానిక సిబ్బంది ఏదో ఒకటి చెప్పి ప్రైవేటుకు వెళ్లేలా చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మత్తు వైద్యుల కొరత ఉంది
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో స్త్రీవైద్యనిపుణులు, మత్తు వైద్యుల కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పీహెచ్సీల్లో సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. శస్త్రచికిత్స అవసరమైతే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపిస్తున్నాం.
- సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్