దళితబంధు అమలుకు శ్రీకారం
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం జిల్లాలో అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా ఒక్కో
నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం జిల్లాలో అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా ఒక్కో నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 350 మంది(బాన్సువాడ సగం)కి రూ.10 లక్షల వంతున లబ్ధి చేకూరనుంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వచ్చే నెల 5వ తేదీలోపు ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయించారు. తదనంతరం లబ్ధిదారులు నిర్దేశించుకున్న యూనిట్లను మార్చి 7లోపు గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించారు. మొదట ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది.
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే...
లబ్ధిదారుల ఎంపికపై పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకే అప్పగించింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ బహిరంగంగా వెల్లడించడం లేదు. గ్రామాల వారీగా దళితుల జనాభాతో పాటు కుటుంబాల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శుల ద్వారా సేకరిస్తున్నారు.
పూర్తయిన మ్యాపింగ్
పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం దళితబంధు పోర్టల్ను ప్రవేశపెట్టింది. ఇటీవలే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల వివరాలతో పటాలు, పేర్లు మ్యాపింగ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారి వివరాలను నమోదు చేయనున్నారు. అర్హులు ఎంపిక చేసుకునేందుకు అవసరమైన యూనిట్ల సమాచార సేకరణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ముఖ్యంగా ఒకేరకమైన యూనిట్లు లేకుండా పోర్టల్ను తీసుకొచ్చారు.
పారదర్శకంగా..
పథకాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అమలు చేసేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక్కో నియోజకవర్గానికి జిల్లాస్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించారు. లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో పాటు యూనిట్ల ఎంపికకు అవసరమైన దిశానిర్దేశం చేయనున్నారు. తదనంతరం గ్రౌండింగ్ చేయించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటు అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!