దస్త్రం లేని.. భూకొలతలు
జిల్లా ఏర్పడి ఐదేళ్లయినా భూ కొలతల శాఖలో దస్త్రాల విభజన పూర్తికాలేదు. హద్దులు తేల్చేందుకు సర్వేయర్లు వినియోగించే కీలకమైన నిజాంకాలం నాటి టిప్పన్లు అందుబాటులో లేకపోవడం సమస్యగా
ఆరేళ్లయినా జిల్లాకు చేరని వైనం
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
చినిగిన పత్రాలు(పాతచిత్రం)
జిల్లా ఏర్పడి ఐదేళ్లయినా భూ కొలతల శాఖలో దస్త్రాల విభజన పూర్తికాలేదు. హద్దులు తేల్చేందుకు సర్వేయర్లు వినియోగించే కీలకమైన నిజాంకాలం నాటి టిప్పన్లు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో కామారెడ్డికి సంబంధించిన వీటిని భద్రపరచడం అక్కడి అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. దీనికి తోడు జిల్లాలోని 72 గ్రామాలకు సంబంధించిన నక్ష(గ్రామ భూముల వివరాలు తెలిపే పటం)లు మాయమవడంతో జిల్లాలో భూ కొలతలు నత్తనడకన సాగుతున్నాయి.
హద్దులు తేల్చడంలో ఇవే కీలకం..
నిజాంకాలం(1927-30)లో మొదటిసారి భూ సర్వే జరిగింది. సర్వే నంబర్లలోని కొలత రికార్డును టిప్పన్ అంటారు. ఇలా గ్రామంలో వీటన్నింటిలోని భూముల కొలతలతో పాటు హద్దుల వివరాలు తెలిపే రికార్డుల ఆధారంగా ఒక గ్రామ పటం తయారు చేశారు. దీన్నే టిప్పన్ నక్షగా పిలుస్తున్నారు. భూ వివాదాల పరిష్కారంలో ఇప్పటికీ నిజాంకాలం నాటి దస్త్రాలే కీలకం. ప్రస్తుతం అవి జిల్లాలో అందుబాటులో లేకపోవడం సర్వే అధికారులకు సమస్యగా మారింది.
నక్ష లేకుంటే సమస్యలే
భూ దస్త్రాల నవీకరణ చేపడుతున్నా.. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్లుగా జిల్లావ్యాప్తంగా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా రెవెన్యూ, అటవీ అధికారుల మధ్య సమన్వయం కుదరక హద్దుల వివాదాలు తేలడం లేదు. గ్రామం వారీగా భూముల స్వరూపాన్ని తెలిపే నక్షలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలో సుమారు 72 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన టిప్పన్ నక్షలు అందుబాటులో లేవు. గతంలో రెవెన్యూ అధికారులుగా వ్యవహరించిన వీఆర్వోల వద్ద నక్షలున్నప్పటికీ ప్రభుత్వానికి ఇవ్వలేదని సమాచారం. ఇటీవల నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి గ్రామనక్షను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విధంగా పలువురు వీఆర్వోలతో పాటు గతంలో పట్వారీలుగా పనిచేసిన వారి వద్ద నక్షలు, నిజాంకాలం నాటి భూ దస్త్రాలున్నట్లు రెవెన్యూ అధికారులే అనధికారికంగా చెబుతున్నారు. వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన యం త్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా..
భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో జిల్లాల వారీగా విభజించారు. జిల్లాకు పూర్తిస్థాయి భూకొలతల అధికారి లేరనే సాకుతో నిజామాబాద్ నుంచి వీటి పంపిణీ జరగలేదు. దీంతో భూ కొలతల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు అక్కడి కార్యాలయానికి వెళ్లి దస్త్రాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వాటి పరిరక్షణ పేరుతో ఎవరైనా సర్వేయరు వెంట వస్తేనే అందిస్తున్నారు.
లేఖ రాశాం
- శ్రీనివాస్, ఏడీ, భూ కొలతలు, కామారెడ్డి
నిజామాబాద్లోనే జిల్లా దస్త్రాలు ఉండిపోయాయి. వాటిని పంపిణీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. త్వరలో అందించే అవకాశం ఉంది. 72 గ్రామాలకు నక్షలు లేని అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాం. సర్కారు ఆదేశాలను అనుసరించి పటాలు రూపొందిస్తాం.
మొత్తం పల్లెలు 523
రెవెన్యూ గ్రామాలు 473
మొత్తం భూ విస్తీర్ణం (ఎకరాలు) 8,63,984.15
సాగు భూములు (ఎకరాలు) 5,14,336.19
ప్రభుత్వ స్థలాలు (ఎకరాలు) 2,99,644.40
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్