logo

విద్యుత్‌ బకాయిలు సకాలంలో చెల్లించాలి

విద్యుత్‌ బకాయిలను సకాలంలో చెల్లించాలని మండల ట్రాన్స్‌కో ఏఈ రాం ప్రసాద్‌ అన్నారు. బీర్కూర్‌ పట్టణంలో............

Updated : 28 Jan 2022 16:33 IST

బీర్కూర్‌: విద్యుత్‌ బకాయిలను సకాలంలో చెల్లించాలని మండల ట్రాన్స్‌కో ఏఈ రాం ప్రసాద్‌ అన్నారు. బీర్కూర్‌ పట్టణంలో శుక్రవారం బకాయిల వసూళ్ల ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. రెండు నుంచి మూడు నెలలకు పైబడి బిల్లులు చెల్లించని వినియోగదారుల ఇళ్లకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. మండల వ్యాప్తంగా రూ.30లక్షల విద్యుత్‌ బకాయిలు ఉన్నట్లు ఏఈ తెలిపారు. ఆయన వెంట లైన్‌ ఇన్‌స్పెక్టర్ పీరాజి, లైన్‌మెన్లు దేవీసింగ్‌, నరేశ్‌ తదితరులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని