హరితహారం పడట్లే
హరితహారం లక్ష్యం తగ్గింది. గతేడాది జిల్లావ్యాప్తంగా 59,20,444 మొక్కలు నాటాలని నిర్దేశించగా.. ఈసారి 45,31,238కు పరిమితం అయ్యారు. వీటిని నాటేందుకు ప్రభుత్వ శాఖల వారీగా కేటాయించారు. ఈసారి వర్షాలు తొందరగానే కురిసే అవకాశం ఉన్నందున మొక్కలు నాటేందుకు
శాఖల వారీగా కేటాయింపు
న్యూస్టుడే, నిజామాబాద్ కలెక్టరేట్
హరితహారం లక్ష్యం తగ్గింది. గతేడాది జిల్లావ్యాప్తంగా 59,20,444 మొక్కలు నాటాలని నిర్దేశించగా.. ఈసారి 45,31,238కు పరిమితం అయ్యారు. వీటిని నాటేందుకు ప్రభుత్వ శాఖల వారీగా కేటాయించారు. ఈసారి వర్షాలు తొందరగానే కురిసే అవకాశం ఉన్నందున మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు స్థలాన్వేషణలో ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయ ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున నాటనున్నారు. ముఖ్యంగా అవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కామారెడ్డి నుంచి డిచ్పల్లి, ఆర్మూర్ మీదుగా నిర్మల్ జిల్లాకు వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా ఆకర్షణీయంగా నాటాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పంచాయతీ నర్సరీల్లో..
జిల్లావ్యాప్తంగా 530 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి మొక్కలు అవసరం ఉంటాయో గ్రామ కార్యదర్శులు తెలుసుకొని అందుకు అనుగుణంగా పెంచుతున్నారు. పండ్లు, పువ్వులు, ఔషధ మొక్కలు ఉన్నాయి. ఉపాధి హామీ కూలీలు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధి కూలీలతో..
జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటుతాం. మండలాలు, శాఖల వారీగా లక్ష్యం విధించాం. ఉపాధిహామీ కూలీలతో నాటేందుకు కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం.
- సంజీవ్ కుమార్, ఏడీపీ, నిజామాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు