నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ
వేసవి సెలవుల్లో చరవాణులు, వీడియోగేమ్లకు అతుక్కుపోకుండా తమలోని అంతర్గత ప్రతిభకు పదునుపెడుతున్నారు. సమయాన్ని వృథా కానీయకుండా సృజనాత్మకతను పెంపొందించుకుంటున్నారు. వివిధ సంస్థలు ఇస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు,
వేసవి శిబిరాల్లో చిన్నారుల సందడి
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం
కర్రసాములో తర్ఫీదు పొందుతూ..
వేసవి సెలవుల్లో చరవాణులు, వీడియోగేమ్లకు అతుక్కుపోకుండా తమలోని అంతర్గత ప్రతిభకు పదునుపెడుతున్నారు. సమయాన్ని వృథా కానీయకుండా సృజనాత్మకతను పెంపొందించుకుంటున్నారు. వివిధ సంస్థలు ఇస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు, తరగతుల్లో పాల్గొంటున్నారు. కరోనాతో రెండేళ్లుగా అవకాశం లేకపోవడంతో ఈసారి అధిక సంఖ్యలో తర్ఫీదు పొందుతున్నారు చిన్నారులు.
బాలభవన్లో 710 మంది
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని చిన్నారుల ఆత్మీయనేస్తంగా పేరొందిన బాలభవన్లో ఏప్రిల్ 18న ప్రారంభమైన వేసవి శిక్షణ తరగతులకు ఈసారి 710 మంది తరలొచ్చారు. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, ఎంబ్రాయిడరీ, మెహెందీ, శ్లోకాలు, కథలు, పద్యాలు, యోగా, కర్రసాము, స్కేటింగ్ వంటి 30 అంశాలపై పది మంది శిక్షకులు తర్ఫీదు ఇస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగే తరగతులతో ప్రాంగణమంతా సందడి నెలకొంది. పిల్లలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పర్యవేక్షకుడు ప్రభాకర్ తెలిపారు.
ధ్యానం సాధన చేస్తున్న బుడతలు
ఐదు అంశాల్లో..
- షణ్ముఖ ప్రియ, ఎనిమిదో తరగతి, నిజామాబాద్
రెండేళ్లుగా వేసవి శిక్షణ తరగతుల కోసం ఎదురుచూశాను. ఈసారి అవకాశం వచ్చింది. కర్రసాము, సంగీతం, యోగా, వృథా వస్తువులతో అందమైన ఆకృతుల తయారీ, కుట్లు అల్లికలు వంటి ఐదు అంశాలపై శిక్షణ తీసుకుంటున్నా.
ఆర్యసమాజ్లో సదాచార ఆవాసం
ఇందూరు ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో కస్బాగల్లీలోని సమాజ్ ప్రాంగణంలో ఈ నెల 13న ప్రారంభమైన బాలబాలికల సదాచార ప్రశిక్షణ ఆవాస శిబిరం 22వ తేదీ వరకు కొనసాగనుంది. నిజామాబాద్తోపాటు సమీప జిల్లాలు, హైదరాబాద్ నుంచి మొత్తం 160 మంది వరకు చిన్నారులు చేరారు. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు గురుకుల పద్ధతిలో తర్ఫీదు ఇస్తున్నారు. ధార్మిక శిక్షణ, వేదమంత్ర పఠనం, పురాణ పురుషులు, ఆరోగ్య, ఆహార నియమాలు, పంచయజ్ఞాలు, యోగా, ధ్యానం, కర్రసాము వంటి అంశాలపై తరగతులు కొనసాగుతున్నాయి. పది రోజులపాటు కొనసాగే ఈ శిక్షణ చిన్నారుల సమగ్ర వికాసం కోసం ఉపయోగపడుతుందని సమాజ్ అధ్యక్షుడు రామలింగం, ఆచార్య వేదమిత్ర చెప్పారు.
మేమే హోమం చేస్తాం
- సమన్విత, నాలుగో తరగతి, హైదరాబాద్
వేసవి సెలవులకు బంధువుల ఇంటికి వచ్చాను. ఇక్కడ ఆర్యసమాజ్లో శిక్షణ ఉందని తెలిసి చేరాను. గురువులు మంచిగా నేర్పిస్తున్నారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ధైర్యం, నైపుణ్య శిక్షణ బాగుంది. మాతోనే హోమం చేయిస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ఆర్యోగ విషయాలు చాలా తెలిశాయి.
రామకృష్ణ సేవా సమితి
జిల్లాకేంద్రంలోని ద్వారకానగర్ కమ్యూనిటీ హాల్లో ధార్మిక, నైపుణ్య శిక్షణ ఇచ్చే రామకృష్ణ సేవా సమితి, వివేకానంద యువ విభాగ్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 31 వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. నిత్యం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తర్ఫీదు ఇస్తున్నారు. 96 మంది చిన్నారులు హాజరవుతున్నారు. అందమైన చేతిరాత, వేదగణితం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, ధ్యానం, గాత్రసంగీతం, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. చిన్నారుల్లో మానసిక వికాసం, నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు సమితి అధ్యక్షుడు సాయిప్రసాద్, శిబిర సమన్వయకర్త వసంత్ పేర్కొన్నారు.
భవిష్యత్తుకు రక్షణ : మనోజ్, తొమ్మిదో తరగతి, నిజామాబాద్
వేసవి శిక్షణలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇక్కడ చాలా విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా లైఫ్స్కిల్స్తో పాటు వేదగణితం, ధ్యానం, వ్యక్తిత్వ వికాస కథాపఠనం బాగుంది. ఇక నుంచి ఏటా తప్పకుండా పాల్గొంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి