logo

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన

మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో రూ.15లక్షలతో నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Updated : 20 May 2022 20:02 IST

బీర్కూర్‌: మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో రూ.15లక్షలతో నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి విగ్రహాలకు అర్చనలు, అభిషేకాలు, జలాదివాసం, పుష్పాదివాసం తదితర పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ రఘు, సర్పంచి బాబూరావు, ఉపసర్పంచి నర్సారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని