కలెక్టర్లు ఇచ్చిన ఎన్వోసీలపై కోర్టుకు..
జిల్లాలో అసైన్డ్ భూములకు గత కలెక్టర్లు శరత్, సత్యనారాయణ ఇచ్చిన ఎన్వోసీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని భాజపా నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భాజపా జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన
సమావేశంలో మాట్లాడుతున్న భాజపా నేత వెంకటరమణారెడ్డి
కామారెడ్డి పట్టణం, న్యూస్టుడే: జిల్లాలో అసైన్డ్ భూములకు గత కలెక్టర్లు శరత్, సత్యనారాయణ ఇచ్చిన ఎన్వోసీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని భాజపా నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భాజపా జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రూ.400 కోట్ల నుంచి 500 కోట్ల భారీ భూ కుంభకోణం జరిగిందన్నారు. దీనికి సూత్రధారులు కలెక్టర్లు కాగా పాత్రధారులు రాజకీయ నాయకులని ఆరోపించారు. అదే అధికారులు ప్రస్తుతం పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు కమిషనర్లుగా పదోన్నతిపై పని చేస్తున్నారన్నారు. జిల్లాలో 153 ఎకరాల అసైన్డ్ భూములకు ఏ ప్రాతిపదికన ఎన్వోసీలు ఇచ్చారో చెప్పాలన్నారు. రామేశ్వర్పల్లి శివారులోని సర్వే నంబర్ 175/ఎలో 3.35 ఎకరాల భూమిని రమేశ్ అనే వ్యక్తికి కలెక్టర్ సత్యనారాయణ ఎన్వోసీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆ భూమిలో 107 ప్లాట్లు చేశారన్నారు. ఇప్పుడు వాటిని కొన్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్ శరత్ భిక్కనూరు, జంగంపల్లి, మాచారెడ్డి ప్రాంతాల్లో 150 ఎకరాలకు ఎన్వోసీ ఇచ్చారని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ తతంగంపై అన్ని సాక్షాలతో కోర్టుకెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీను, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, పట్టణాధ్యక్షుడు విపుల్, ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు నరేందర్, శ్రీనివాస్, ప్రవీణ్, రవి, నాయకులు భరత్, సురేష్, మహేష్గుప్తా తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే