logo

ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తాం

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు సంక్షేమం సిద్ధిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తెలిపారు. దోమకొండ మండలం లింగుపల్లి, సంగమేశ్వర్, గొట్టిముక్కుల గ్రామాల్లో ఆదివారం రచ్చబండ కార్యక్రమం

Published : 23 May 2022 05:14 IST

దోమకొండ, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు సంక్షేమం సిద్ధిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తెలిపారు. దోమకొండ మండలం లింగుపల్లి, సంగమేశ్వర్, గొట్టిముక్కుల గ్రామాల్లో ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం పేరిట కౌలు రైతులకు కలిపి ఎకరాకు రూ..15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్వయసాయానికి అనుసంధానిస్తామన్నారు. వారంలోగా కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మద్ధి చంద్రకాంత్‌రెడ్డి, మండలాధ్యక్షుడు అనంతరెడ్డి, నాయకులు స్వామి, రామస్వామి, గోపాల్‌రెడ్డి, రాములు ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని