logo

దసరాలోపు రెండు పడక గదుల ఇళ్లు

పట్టణంలో పోచమ్మగల్లీ సమీపంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిని పూర్తి చేయాలని పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 23 May 2022 05:14 IST

ఆర్మూర్‌ పట్టణం : పట్టణంలో పోచమ్మగల్లీ సమీపంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిని పూర్తి చేయాలని పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 160 ఇళ్లు మంజూరు అవ్వగా, అందులో 120 నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. భవనాల నాణ్యతను పరిశీలించారు. దసరాలోపు పేదలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వెంట ఎంపీపీ నర్సయ్య, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ షేక్‌మున్ను, తెరాస నాయకులు పండిత్‌ పవన్, పుర, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని