logo

అప్పు ఇవ్వనందుకు దంపతులపై దాడి

అడిగినంత అప్పు ఇవ్వనందుకు ద్విచక్రవాహనం కాల్చడంతోపాటు దంపతులపై దాడి చేసి గాయపరిచిన ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ పరిధిలోని ఒడ్డెరకాలనీలో ఆదివారం

Published : 23 May 2022 05:14 IST

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: అడిగినంత అప్పు ఇవ్వనందుకు ద్విచక్రవాహనం కాల్చడంతోపాటు దంపతులపై దాడి చేసి గాయపరిచిన ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ పరిధిలోని ఒడ్డెరకాలనీలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దేవునిపల్లి ఇన్‌ఛార్జి ఎస్సై నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అదే కాలనీలో నివాసముండే నరేష్‌ తన బంధువైన హన్మంత్‌ను రూ.లక్ష అప్పు కావాలని అడిగారు. తన దగ్గర లేవని చెప్పడంతోనే ఆగ్రహించిన నరేష్, అతని కుటుంబసభ్యులు పెంటయ్య, రాజవ్వ హన్మంత్‌ ద్విచక్రవాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. ఇదేమిటని అడిగిన హన్మంత్‌ను రాళ్లు, కర్రలతో కొట్టారు. కాపాడబోయిన అతడి భార్య నర్సవ్వపైనా దా¨ చేశారు. భార్యాభర్తలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎస్సై పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని