logo

కానిస్టేబుళ్ల బదిలీ

జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న 58 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో అయిదేళ్లు పూర్తిచేసుకున్న వారే ఉన్నారు. ఆప్షన్ల ఆధారంగా వారి పనితీరు

Published : 24 May 2022 04:04 IST

కామారెడ్డి నేరవిభాగం: జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న 58 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో అయిదేళ్లు పూర్తిచేసుకున్న వారే ఉన్నారు. ఆప్షన్ల ఆధారంగా వారి పనితీరు-ప్రవర్తన, పరిస్థితులను ప్రామాణికంగా తీసుకొని బదిలీ ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది.
నేడో-రోపో ఏఎస్సైలు, హెడ్లు.. ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్ల బదిలీలు సైతం త్వరలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వీరు జోనల్‌ క్యాడర్‌లోకి వెళ్లడంతో డీఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంది. బదిలీల ప్రక్రియంతా పూర్తైనా ఉత్తర్వులు ఒకటి-రెండు రోజుల్లో పైనుంచి రానున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని