logo

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

చండీగఢ్‌లో ఈ నెల 26 నుంచి 30 వరకు జరగనున్న జాతీయస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు

Published : 24 May 2022 04:17 IST

క్రీడాకారులతో సంగీత, అసోసియేషన్‌ ప్రతినిధులు

డిచ్‌పల్లి : చండీగఢ్‌లో ఈ నెల 26 నుంచి 30 వరకు జరగనున్న జాతీయస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, గంగామోహన్‌ తెలిపారు. బాలికల విభాగంలో ఇందు, సృజన, మహేశ్వరి, సౌందర్య, సరయు, సోని, అరుణ, శ్రీహర్షిత, బాలుర విభాగంలో శివకుమార్‌, నీలేందర్‌, సెంథిల్‌ ఎంపికైనట్లు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల జిల్లా సమన్వయకర్త సంగీత, స్పోర్ట్స్‌ సమన్వయకర్త నీరజ, పీఈటీలు జ్యోత్స్న, కోచ్‌ అనికేత్‌ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
జిజ్ఞాస పోటీల్లో ప్రతిభ
కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిజ్ఞాస పోటీల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ  కళాశాల కామర్స్‌ విభాగానికి ద్వితీయ బహుమతి దక్కింది. రాజధానిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ చేతుల మీదుగా ప్రిన్సిపల్‌ కిష్టయ్య బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అధ్యాపకులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని