అగ్గువకే మడిగెలు ఇవ్వాలట..
నగరంలోని ఖలీల్వాడి, తిలక్గార్డెన్ సముదాయంలోని మడిగెలవి. ఇక్కడ మొత్తం 66 దుకాణాలు ఉన్నాయి. అందులో మూడు మడిగెల యజమానులు సరిగా అద్దె చెల్లించట్లేదు. అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేదు.
న్యూస్టుడే, నిజామాబాద్ నగరం
దుకాణాల సముదాయం
నగరంలోని ఖలీల్వాడి, తిలక్గార్డెన్ సముదాయంలోని మడిగెలవి. ఇక్కడ మొత్తం 66 దుకాణాలు ఉన్నాయి. అందులో మూడు మడిగెల యజమానులు సరిగా అద్దె చెల్లించట్లేదు. అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేదు. ఒక్కో దాని ద్వారా రూ.9 లక్షల వరకు అద్దె రావాల్సి ఉంది. దీంతో వాటిని రద్దు చేసి కొత్తగా టెండర్ వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అధికారులపై ఒత్తిడి.. : నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త వాటిలో ఓ దుకాణం తనకు కేటాయించాలని కోరుతున్నారు. ఆయనకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నగరానికి చెందిన మరో నేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాత ఒప్పందాన్ని రద్దు చేసి ఆయన పేరుపై మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
నిబంధనల ప్రకారం.. : ఏదైనా పరిస్థితిలో మడిగె ఖాళీ అయితే మేయర్ అనుమతి మేరకు అధికారులు అద్దెకు ఇస్తారు. మడిగె కిరాయి, దరఖాస్తు ఫీజు, ప్రభుత్వానికి చెల్లించే సొమ్ము వంటి వివరాలతో పత్రికలో నోటిఫికేషన్ జారీ చేస్తారు. టెండర్ వేసే ఆఖరి రోజుని నోటీసులో తెలియజేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎవరు ఎక్కువ సొమ్ము, అద్దె చెల్లించడానికి ముందుకొస్తారో వారికి దుకాణం కేటాయిస్తారు.
ఎందుకోసమంటే.. : దుకాణాలను తీసుకున్న తర్వాత వాటిని అధిక ధరలకు ఇతరులకు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కూడా ఇతరులకు ఇచ్చుకోవచ్చని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో పత్రికలో నోటిఫికేషన్ లేకుండా అంతర్గతంగా ప్రక్రియ పూర్తి చేయించాలని చూస్తున్నారు. పలుమార్లు అధికారులతో వాదనకు దిగారు. ఈ విషయమై ‘న్యూస్టుడే’ నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబును వివరణ కోరగా.. ‘ఖాళీగా ఉన్న మూడు మడిగెలను నిబంధనల మేరకే కేటాయిస్తాం. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!