మియా సమయస్ఫూర్తి..కావాలి అందరికీ స్ఫూర్తి..
అమెరికాలోని యువాల్డీ నగరంలో ఒక పాఠశాలలో ఒక యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అదే బడిలో చదివే మియా సెరిల్లో అనే 11 ఏళ్ల అమ్మాయి ఒక విద్యార్థిని. దుండగుడు కాల్పులు జరుపుతుంటే తప్పించుకోవడానికి అప్పటికే రక్తపు మడుగులో ఉన్న తన స్నేహితురాలి రక్తం
యువాల్డీ కాల్పుల ఘటన అనుభవ పాఠం
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్
అమెరికాలోని యువాల్డీ నగరంలో ఒక పాఠశాలలో ఒక యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అదే బడిలో చదివే మియా సెరిల్లో అనే 11 ఏళ్ల అమ్మాయి ఒక విద్యార్థిని. దుండగుడు కాల్పులు జరుపుతుంటే తప్పించుకోవడానికి అప్పటికే రక్తపు మడుగులో ఉన్న తన స్నేహితురాలి రక్తం తనకు అంటించుకుని చనిపోయినట్లు నటించింది. దుండగుడు వెళ్లిపోగానే కాల్పుల్లో మృతిచెందిన టీచర్ ఫోన్ తీసుకుని 911కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వారు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
పదకొండేళ్ల అమెరికా అమ్మాయి సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు మన పిల్లల సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో సమీక్షించుకునే పరిస్థితి కల్పించింది. వాస్తవానికి ఇలాంటి ఘటనల్లో కంగారులో అనవసరంగా ప్రమాదంలో పడే పరిస్థితులు కల్పించుకుంటారు. కానీ, ఆ చిన్నారి సమయోచితంగా వ్యవహరించిన తీరు తమ పిల్లల్లోనూ అలవడాలని అభిలషించే వారి సంఖ్య అధికంగానే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. కాల్పులు, బాంబుదాడులు వంటి ఘటనలే కాకపోయినా... వరదలు, అగ్ని ప్రమాదాలు, అత్యాచారాలు, వేధింపుల వంటి ఘటనల్లో స్పందించి కట్టడిచేసే సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరముంది.
మన చదువుల్లో నేర్పుతున్నదేమిటి?: 8వ తరగతిలో ‘చట్టం న్యాయం’ అనే అంశంలో గొడవ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ సన్నివేశాన్ని ఇస్తారు. 9వ తరగతిలో శిశు, మహిళా చట్టాల గురించి వివరించారు. రహదారి భద్రత, చట్టాలు, విపత్తు నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ వంటివి వివరించారు. అందులోనే అపరిచిత వస్తువులపై డయల్ 100కు అగ్ని ప్రమాదం జరిగితే 101కు సమాచారం ఇవ్వాలని పాఠ్యాంశాల్లో వివరించారు. వీటిని నిజ జీవితంలోకి అన్వయించుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. వీటిని జీవిత పాఠాలుగా కాకుండా ఇంకా మార్కుల సాధన కోసమనే భావనతో నేర్పించడమే కారణం. ప్రయోగాత్మకంగా మాక్డ్రిల్ నిర్వహించి వివరిస్తే విద్యార్థుల మదిలో నాటుకుపోతుంది. బోర్డుపై రాసి చదువుమంటే ఇతర పాఠ్యాంశాల మాదిరిగానే నేర్చుకుంటున్నారు.
కొవిడ్తో నిలిచిన పోలీసు శిక్షణ...: ‘స్టూడెంట్ పోలీసు కేడెట్’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టింది. అలా నిజామాబాద్ జిల్లాలో 20 బడుల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది. వేధింపులు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో పోలీసుల మాదిరిగా ఈ విద్యార్థి పోలీసు తక్షణం స్పందించాలి. పోలీసులకు సమాచారం అందించి నియంత్రించాలి. 2018లో మొదలైన కార్యక్రమంలో 8, 9వ తరగతుల్లో చురుకైన విద్యార్థుల్లో 48 మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. జైలు సందర్శన, బెటాలియన్ శిక్షణ, చట్టాలు, బాధ్యతలపై బోధన కోర్సులో భాగం. ఈ శిక్షణ కొవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయింది. విద్యార్థి పోలీసులు సమాజాన్ని జాగృతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించడం, నేర నియంత్రణలో పోలీసులకు సహకారులుగా ఉంటారని భావించారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం.
వివిధ దేశాల్లో : అమెరికాలో పాఠశాల స్థాయిలోనే పిల్లలకు అత్యవసర ఫోన్ నంబర్లపై అవగాహన కల్పిస్తారు. ఏ చిన్న సమస్య వచ్చినా 911కు ఫోన్ చేస్తారు. అందుకే దీన్ని ఏంజిల్(దైవదూత) నంబరు అంటారు. ఫిన్లాండులో చదువుకంటే ముందు స్వయంగా నిలదొక్కుకునే సామర్థ్యాలు నేర్పిస్తారు.
సదస్సులు నిర్వహిస్తున్నా...: ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, గృహహింస కేసులు నమోదవుతుంటాయి. ఇలాంటి నేరాల్లో బాలలు నేరుగా ఫోన్ చేసి ఒక్క ఘటనను నియంత్రించిన సందర్భాలు లేవు. కనీసం తోటి బాలికకు ఇష్టం లేకపోయినా వివాహం జరిపిస్తున్నారనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇక రోడ్డు ప్రమాదం జరిగి రక్తపు మడుగులో ఒక వ్యక్తి విలవిల్లాడుతుంటే 108కు ఫోన్ చేయాలనే స్పృహ ఉండటంలేదనేది వాస్తవం. పలు నేరాల నియంత్రణకు నిర్దేశించిన ఫోన్ నంబర్లపై పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించడానికి పోలీసు, ఐసీడీఎస్, న్యాయశాఖలు సదస్సులు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు సమయస్ఫూర్తిగా స్పందించే సామర్థ్యాలు పెంచుతున్నాయో, లేదో సమీక్షించాల్సిన అవసరముంది.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
- ఈశ్వర్, విద్యార్థి పోలీసు సమన్వయాధికారి
విద్యార్థి పోలీసు శిక్షణ కరికులం ఆత్మవిశ్వాసం పెంపొందించేదిగా ఉంది. సమాజంలోని నేరాలు, విపత్తులు సహా పోలీసులు నిర్వర్తించే బాధ్యతలపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. కళ్లెదుట జరిగే నేరాలు, ప్రమాదాలు, వేధింపులు, మోసాలను నియంత్రించే విషయ పరిజ్ఞానం లభిస్తుంది. కొవిడ్తో కొంత విరామం వచ్చింది. పునప్రారంభిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు స్థైర్యాన్నిస్తుంది.
విపత్తుల నిర్వహణపై అవగాహన
- లింగం, స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సహాయ కమిషనర్
విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించే తీరుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ పనిచేస్తుంది. 6-9 తరగతుల్లో విద్యార్థుల్లో ఒక్కో తరగతి నుంచి 8 మంది చొప్పున యూనిట్కు 32 మందికి ఇచ్చే శిక్షణ సమాజంలో అందరిలో అవగాహన పెంచడానికి దోహదం చేస్తుంది. మా విద్యార్థులు పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పరిశీలించి నివేదిక రాస్తారు. ఇలా పిల్లలందరికీ ప్రమాదాలు, విపత్తుల్లో స్పందించే తీరు నేర్పాలి.
గతేడాది అధికారికంగా నమోదైన నేరాల తీరు
హత్యలు : 44
హత్యాయత్నాలు : 48
అత్యాచారాలు : 37
న్యూసెన్సు : 17,959
పోక్సో : 2
ఈవ్టీజింగ్ : 21
అడ్డుకున్న బాల్య వివాహాలు : 14
టోల్ఫ్రీ నంబర్లు...
పోలీసు : 100
అగ్నిమాపక : 101
అంబులెన్సు : 102, 108
మహిళా సహాయ కేంద్రం : 181
ఛైల్డ్లైన్ (చిన్నారులకు) : 1098
విపత్తు సహాయ కేంద్రం : 1077
రాష్ట్ర విపత్తు నియంత్రణ కేంద్రం : 1070
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు