ఇందూరు ఓటు విలువ 3288
ఇప్పుడు గల్లీ నుంచి దిల్లీ దాకా ఒకటే చర్చ. ఆసక్తికరమైన లెక్కలు. ప్రజలెవరూ పాల్గొనకున్నా... దేశ అత్యున్నత పదవికి జరిగే పోరుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అధికార, విపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి
ఇప్పుడు గల్లీ నుంచి దిల్లీ దాకా ఒకటే చర్చ. ఆసక్తికరమైన లెక్కలు. ప్రజలెవరూ పాల్గొనకున్నా... దేశ అత్యున్నత పదవికి జరిగే పోరుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అధికార, విపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. 16వ రాష్ట్రపతి ఎన్నికలో ఆయా పార్టీల చట్టసభ సభ్యుల బలాబలాలతో గెలుపెవరిదో ఒక స్పష్టత వచ్చింది. జులై 18న జరిగే పోలింగ్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందూరు నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి ఓటు విలువ ఎంత? అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తుంది. దీనిపై ‘న్యూస్టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
సాధారణంగా జరిగే ఎన్నికలకు, రాష్ట్రపతి ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఒక ఓటరు విలువ ఒక అభ్యర్థికి ఒకటిగానే పరిగణిస్తారు. కానీ ఎలక్టోరల్ కాలేజీ (రాష్ట్రపత్రి ఎన్నిక విధానం)లో... ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఓటు విలువ మారుతుంది. ఎమ్మెల్యే ఓటు విలువను 1971లోని రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేల స్థానాలతో భాగిస్తారు. మళ్లీ ఆ విలువను 1000తో భాగించగా వచ్చిన విలువ ఎమ్మెల్యే ఓటు విలువ అవుతుంది.
ఎమ్మెల్యేది 132
రాష్ట్ర జనాభా ఆధారంగా లెక్కిస్తే రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఓటు విలువ 132గా వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ లెక్కన మన జిల్లా నుంచి ఓటు హక్కు వినియోగించుకునే శాసనసభ్యులందరి ఓటు విలువ 1188 అవుతుంది.
ముగ్గురు ఎంపీలు..
ఉమ్మడి జిల్లా పరిధి నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అంటే ఇద్దరు ఎంపీ (లోక్సభ)లు ఉన్నారన్నమాట. రాజ్యసభకు ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎలక్టోరల్ కాలేజీలో ఒక ఎంపీ ఓటు విలువ 700గా నిర్ణయించారు. ముగ్గురు ఎంపీల విలువ 2100 కానుంది.
ఎలా గణిస్తారంటే?
ఎంపీల ఓటు విలువను ప్రత్యేకంగా గణిస్తారు. అన్ని రాష్ట్రాల శాసన సభ్యుల మొత్తం ఓటు విలువను పార్లమెంటులోని రాజ్యసభ, లోక్సభ సభ్యులతో భాగిస్తారు. ఈ లెక్కన దేశంలోని శాసనసభ్యుల మొత్తం ఓటు విలువ 5,43,231 కాగా పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య 776తో భాగించగా ఓటు విలువ 700గా తేలింది. గతసారి 708 ఉండగా జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ స్థానాలు లేకపోవడంతో విలువలో మార్పు వచ్చింది.
పార్టీల వారీగా చూస్తే...
పార్టీ ఎమ్మెల్యే ఓటు మొత్తం ఓటు
స్థానాలు విలువ విలువ
తెరాస 9 132 1188
(ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కాంగ్రెస్ నుంచి గెలిచినా తెరాసలో కొనసాగుతున్నారు)
ఎంపీ ఓటు విలువ
భాజపా 1 700 700
తెరాస 2 1400 1400
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!