డిగ్రీతోనే కలల కొలువు
బీటెక్, ఎంటెక్ చదవకున్నా డిగ్రీ మూడో ఏడాదిలో ఉండగానే ఐదంకెల వార్షిక జీతం కలిగిన ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. జిల్లా యువకులు ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల కళాశాలలకు ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి మౌఖిక పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని
ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ
ముందుకొస్తున్న ఆయా సంస్థలు
బీటెక్, ఎంటెక్ చదవకున్నా డిగ్రీ మూడో ఏడాదిలో ఉండగానే ఐదంకెల వార్షిక జీతం కలిగిన ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. జిల్లా యువకులు ప్రాంగణ నియామకాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల కళాశాలలకు ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి మౌఖిక పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. సంస్థలో వచ్చే ఆటుపోట్లు, ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులతో సంబంధాల నిర్వహణ తదితర అంశాల్లో పరీక్షిస్తున్నారు. చురుగ్గా ఉన్న వారిని ఎంపిక చేసుకొని ఉద్యోగాలకు అవసరమైన కోర్సుల్లో వారే శిక్షణ అందిస్తున్నారు.
ఫలిస్తున్న టాస్క్ సదస్సులు
డిగ్రీ విద్యార్థులకు టాస్క్ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి కళాశాలలో ఒక శిక్షకుడిని నియమించారు. వారి ద్వారా ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆంగ్లంపై పట్టు పెంపొందించుకునేలా మెలకువలు సూచిస్తున్నారు. సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే వందలాది మంది ఎంపిక
ఐదేళ్లుగా జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న ప్రాంగణ నియామకాల ద్వారా ఇప్పటికే 350 మంది ఎంపికయ్యారు. వీరికి ప్రారంభంలో రూ.15 వేల- 18 వేల వరకు వేతనం ఉండగా.. అనుభవం ఆధారంగా రూ.35 వేల వరకు అందుకుంటున్నారు. సాధారణ డిగ్రీ చదువులతో అనేక మంది సాఫ్ట్వేర్ ఇతర కొలువులు సాధిస్తున్నారు. కొద్దిమంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికైనా ఉన్నత చదువుల వైపే ఆసక్తి చూపుతున్నారు.
సామాజిక విషయాలపై అవగాహన
- సుస్మిత, ఎంఎస్టీసీఎస్, తృతీయ సంవత్సరం
చదువులతో పాటు సామాజిక విషయాలపై అవగాహన ఉండటంతో ఇటీవల నిర్వహించిన ఉద్యోగ మేళాలో ప్రతిభచాటా. సంస్థ నిర్వహణ, లోపాలు ఎదురైనప్పుడు సవాళ్లను ఎలా స్వీకరించాలో మౌఖిక పరీక్షలో విశదీకరించా. ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కావడానికి ఇదే దోహదపడింది.
సమకాలీన అంశాలపై పట్టుతోనే
- శ్రుతి, బీకాం సీఏ, తృతీయ సంవత్సరం
ఇంటర్మీడియెట్ నుంచే సమకాలీన అంశాలపై పట్టు పెంచుకుంటున్నా. ఇటీవల నిజామాబాద్లో ఒమెగా హెల్త్కేర్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యా. ఏడాదికి రూ.3 లక్షల వేతనం ఇస్తామని చెప్పారు. డిగ్రీతోనే మెరుగైన ఉద్యోగం సాధించడం ఆనందాన్ని నింపింది.
నడవడికను గమనించారు
- గీతాశ్రీ, బీకాం సీఏ, తృతీయ సంవత్సరం
రాత పరీక్షలో ఎంపికైన వారికి మౌఖిక పరీక్ష నిర్వహించారు. అందులో ముఖ్యంగా సంస్థ ప్రతినిధులు నడవడికను నిశితంగా పరిశీలించారు. మాట తీరు, ముప్పులను అధిగమించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయా అని ఆరా తీశారు. తొలి ప్రయత్నంలోనే ఐదంకెల వార్షిక జీతంతో ఎంపికవడం నాలో ఆత్మస్థైర్యం నింపింది.
మౌఖిక పరీక్ష కీలకమే
- దేవరాజు, బీకాం సీఏ, తృతీయ సంవత్సరం
ప్రాంగణ నియామకాల్లో రాత పరీక్షకన్నా మౌఖిక పరీక్షే కీలకం. ఆంగ్ల భాషలో నైపుణ్యం, సమయపాలన, భావ వ్యక్తీకరణ అంశాలు పరిశీలించారు. నిమిషానికి ఆరు ప్రశ్నలు వేశారు. ఐదింటికి సమాధానాలు ఇచ్చా. డిగ్రీ పూర్తవ్వగానే ప్రముఖ సంస్థలో పని చేసే అవకాశం రావడం ఆనందం కలిగించింది.
ఆంగ్ల భాషలో నైపుణ్యంతోనే ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యా. వేతనం ఎంతైనా మొదట అనుభవం వస్తే భవిష్యత్తులో రాణించే వీలుంటుంది. డిగ్రీ అనంతరం ఉన్నత చఆంగ్లంలో నైపుణ్యంతో..
- చందన, బీకాం, ఎంఎస్టీసీఎస్, తృతీయ సంవత్సరంద
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురపాలక ఛైర్మన్పై అవిశ్వాసం
[ 24-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భారాస పార్టీ కౌన్సిలర్లు తీర్మానించినట్లు తెలుస్తుంది. -
కాంగ్రెస్లో చేరిన పుర ఛైర్మన్
[ 24-04-2024]
పుర ఛైర్మన్ సత్యనారాయణ సంగారెడ్డిలో బుధవారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. -
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్