తగ్గుతున్న రైతు గౌరవం
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్(గౌరవ) నిధి పథకంలో భాగంగా ఇటీవల రైతుల ఖాతాల్లో 11వ విడత నగదు జమ చేశారు. జిల్లాలో సాంకేతిక కారణాలతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. అన్ని అర్హతలున్నా కొంతమందికి సాయం అందడం లేదు. దీనికి తోడు కొందరికి నగదు
కిసాన్ సమ్మాన్ పంపిణీలో సమస్యలు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్(గౌరవ) నిధి పథకంలో భాగంగా ఇటీవల రైతుల ఖాతాల్లో 11వ విడత నగదు జమ చేశారు. జిల్లాలో సాంకేతిక కారణాలతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. అన్ని అర్హతలున్నా కొంతమందికి సాయం అందడం లేదు. దీనికి తోడు కొందరికి నగదు జమ చేసినట్లు చరవాణికి మెసేజ్ వస్తున్నా ఖాతాల్లో మాత్రం కనిపించడం లేదు. పరిష్కారం చూపాల్సిన వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు సమర్పిస్తున్నా సాయం అందని పరిస్థితి నెలకొంది.
రెండున్నరేళ్లుగా తెరుచుకోని పోర్టల్
శ్రమను నమ్ముకొని జీవించే అన్నదాతకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టింది. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయానికి తోడు ఈ డబ్బులు పడటంతో కర్షకులకు ఒకింత భరోసా కలుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా 2019 డిసెంబరు 18 నుంచి కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన వారితోపాటు, సాంకేతిక కారణాలతో నగదు అందుకోని రైతులు దరఖాస్తులు చేసినా మోక్షం లభించడం లేదు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్ను ఏర్పాటు చేసింది. ఇందులో నమోదైన రైతులకే సాయం అందుతోంది.
సాంకేతిక కారణాలతో..
ఇటీవల 11వ విడత సాయం పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని నిజాంసాగర్, జుక్కల్, మద్నూర్ తదితర మండలాలకు చెందిన పలువురు రైతులకు సాయం జమైనట్లు చరవాణికి సమాచారం వచ్చింది కానీ ఖాతాలో మాత్రం పడలేదు. ఇలా వందలాది మందికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం కిసాన్ సమ్మాన్ నిధి ఈకేవైసీ చేయడం మూలంగా ఆధార్ అనుసంధానం ఉన్న ఇతర బ్యాంకు ఖాతాలో నగదు జమై ఉంటుందని వెల్లడిస్తున్నారు. గతేడాది వేసిన బ్యాంకు ఖాతాల్లో కాకుండా వేరే ఇతర వాటిల్లో జమ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్ని ఖాతాలు సరిచూసుకోవాలని అధికారులు నిర్దేశిస్తున్నారు.
ఏటేటా తగ్గుతున్న లబ్ధిదారులు
ఈ పథకం ప్రారంభమైన మొదట్లో జిల్లాలో 1,24,606 మందికి సాయం అందించారు. ఈ ఏడాది మార్చి నాటికి 1,16,223 మందికి చేరారు. అంటే పది విడతల్లో 8,383 మంది రైతులు తగ్గారు.
ఆరుసార్లు దరఖాస్తు చేసినా..
- దత్తురెడ్డి, పుల్కల్, కామారెడ్డి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఇప్పటి వరకు ఆరుసార్లు దరఖాస్తు సమర్పించినా నగదు జమకావడం లేదు. అధికారులను అడిగితే పోర్టల్ తెరుచుకోవడం లేదంటున్నారు. ప్రజావాణిలో కలెక్టర్కు దరఖాస్తు చేసినా ప్రయోజనం లేదు.
ఖాతాలో జమ కాలేదు
11వ విడత సమ్మాన్ సాయం జమైనట్లు చరవాణికి సమాచారం వచ్చింది కానీ ఖాతాలో పడలేదు. అధికారులను అడిగితే వేరే ఖాతాలో చూడమంటున్నారు. ఎందులోనూ పడలేదు. పలువురు రైతులకూ ఇదే విధంగా జరిగింది. అధికారులు దీనిని సరిచేయాలి.
ఉన్నతాధికారులకు నివేదించాం
కొందరు రైతుల చరవాణికి సమాచారం వచ్చినా బ్యాంకు ఖాతాలో జమ కావడంలేదనే ఫిర్యాదులొస్తున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. కొత్తగా రైతుల నమోదుకు పోర్టల్ తెరుచుకోవడం లేదు. రెండున్నరేళ్లుగా ఇదే సమస్య ఉంది. పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ఆధార్తో అనుసంధానం చేస్తున్నారు.
- భాగ్యలక్ష్మి, వ్యవసాయాధికారిణి, కామారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!