logo

30 కిలోల గంజాయి స్వాధీనం

నందిపేట్‌ మండలంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో 30 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.

Published : 28 Jun 2022 06:38 IST

 ముగ్గురు నిందితుల అరెస్టు

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తా

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నందిపేట్‌ మండలంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో 30 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇందులోని ఇద్దరు ఉస్మాన్‌, అక్బర్‌ సుపారీ హత్య కుట్ర కేసులోనూ నిందితులుగా ఉన్నారు. కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ అరవింద్‌బాబు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందిపేట్‌లో ఉండే షేక్‌ ఫర్జానా కొంతకాలంగా ఎండు గంజాయిని విక్రయిస్తోంది. ఆమె కొడుకు ఉస్మాన్‌ లారీ డ్రైవర్‌. తాజాగా నార్కట్‌పల్లికి చెందిన వెంకట్‌, నిజామాబాద్‌ నగరానికి చెందిన ఉస్మాన్‌ నుంచి 40 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని ఉస్మాన్‌, అక్బర్‌ నందిపేట్‌కు తీసుకెళ్లి ఫర్జానాకు అప్పగించారు. తాజాగా ఎస్సై మురళి ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో ఆమె ఇంట్లో 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని