ప్రగతి పనులకు ప్రతిబంధకాలు
నగర, పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సౌకర్యవంతమైన జీవన విధానానికి అనువుగా ప్రగతి చేపట్టాలని నిధులు కేటాయిస్తోంది.
న్యూస్టుడే, బోధన్ పట్టణం
బోధన్-నర్సిరోడ్డులో అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజీ పనులు
నగర, పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సౌకర్యవంతమైన జీవన విధానానికి అనువుగా ప్రగతి చేపట్టాలని నిధులు కేటాయిస్తోంది.
క్షేత్రస్థాయిలో ప్రగతికి ఎదురవుతున్న ప్రతిబంధకాలు అవరోధంగా మారాయి. కేటాయించిన నిధులు సకాలంలో ఖర్చు చేయలేకపోవడం ఒక ఎత్తైతే.. పనుల్లో జాప్యం మరో ఎత్తు.
టీయూఎఫ్ఐడీసీ ద్వారా 2018లో బల్దియాలకు రుణ రూపంలో రూ.కోట్లలో నిధులు వచ్చాయి. వీటితో సుందరీకరణ పనులు, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్నది లక్ష్యం. పట్టణ ప్రగతి నిధులతో మరికొన్ని పనులు ప్రతిపాదించారు. ఇతర పద్దుల్లోనూ వచ్చిన నిధులు వసతుల కల్పనకు నిర్దేశించారు. అమల్లో మాత్రం ప్రగతి లేకుండాపోయింది.
ఆగడానికి కారణాలెన్నో...
బల్దియాలకు వచ్చిన నిధులు సకాలంలో ఖర్చు చేయడంలో అధికారుల ప్రణాళిక లోపిస్తోంది. పనులు మొదలుపెట్టినప్పుడు ఆక్రమణలు, విద్యుత్తు లైన్లు, భూవివాదం.. ఇవి పనుల జాప్యానికి తొలి కారణంగా నిలుస్తున్నాయి. ఆ తరువాత బిల్లులు సరిగా రావడంలేదని గుత్తేదారులు జాప్యం చేస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు..
* నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో మాలపల్లి వద్ద కల్వర్టు నిర్మాణానికి తవ్వకాలు చేపట్టి వదిలేశారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
* నగరంలోని వినాయకుల బావి వద్ద సాధారణ నిధులతో రహదారి నిర్మాణానికి పొక్లెయిన్తో ఒక పక్క తవ్వారు. పనులు పూర్తి చేయడంలో నెల రోజులుగా తాత్సారం చేస్తున్నారు. అసలే గుంతల రహదారి..ఆపై తవ్వకాలతో సమస్య మరింత జటిలంగా మారింది.
* బోధన్-నర్సి రోడ్డులో వరద నీటి కాలువ నిర్మాణం ప్రహసనంగా మారింది. రహదారి వెడల్పుపై నెలకొన్న వివాదంతో సగం వరకు నిర్మించి వదిలేశారు. అసంపూర్తి పనితో వర్షపు నీరు ఎటూ ప్రవహించలేని పరిస్థితి. పైగా ఇది వాణిజ్య కేంద్రం కావడంతో కాలువ అవతల ఉన్న దుకాణాలకు కొనుగోలుదారులు వెళ్లలేని దుస్థితి. దీనికితోడు నిలిచిన మురుగుతో దుర్గంధం వ్యాపిస్తోంది. పట్టణంలో పలు చోట్ల ఇదే సమస్య ఉంది.
* బోధన్ శక్కర్నగర్ చౌరస్తా నుంచి శివాలయం వెళ్లే దారిలో కల్వర్టు ప్రమాదకరంగా మారింది. సగం వరకు గోడ కూలింది. భారీ వాహనం వెళితే మొత్తంకూలడం ఖాయమన్నట్లు ఉంది. దీని నిర్మాణంపై ఇంకా స్పష్టత లేదు. ఏటా వచ్చే వరదతో కల్వర్టు గోడ కొద్దికొద్దిగా కొట్టుకుపోతోంది.
* ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు విస్తరించాల్సిన సెంట్రల్ లైటింగ్ పనులు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయాయి. ఫలితంగా ఆ కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులు అరకొర వెలుతురులో మగ్గుతున్నాయి. వర్షాకాలం రహదారులపై విద్యుత్తు కాంతులవసరం ఎంతైనా ఉంది.
టీయూఎఫ్ఐడీసీ నిధులు (రూ.కోట్లలో)
నిజామాబాద్ : 100
బోధన్ : 50
ఆర్మూర్ : 50
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం