బిల్లులు రాక బెంగ
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మన ఊరు- మన బడి పథకం కింద ఇప్పటికే 132 చోట్ల ప్రారంభమైన మరమ్మతు పనులు మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా ఉపాధి హామీ నిధులతోనూ మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్షెడ్లు కొత్తవి నిర్మించాలని నిర్ణయించారు.
బడుల్లో అభివృద్ధి పనులపై ప్రభావం
ఈనాడు, నిజామాబాద్
ప్రహరీ లేని తడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మన ఊరు- మన బడి పథకం కింద ఇప్పటికే 132 చోట్ల ప్రారంభమైన మరమ్మతు పనులు మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా ఉపాధి హామీ నిధులతోనూ మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్షెడ్లు కొత్తవి నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు వ్యయ అంచనాలను పూర్తి చేశారు. ముందస్తుగా పెట్టుబడి పెట్టి పనులు చేయాల్సి ఉండటంతో గుత్తేదార్లు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు, సర్పంచులతో అధికారులు చర్చిస్తున్నా.. బిల్లులు ఆలస్యమైతే ఎలా అనే సంశయంతో ఉన్నారు.
తొలి విడతలో 132
మన ఊరు-మన బడిలో భాగంగా జిల్లాలో 407 పాఠశాలల్లో మరమ్మతులు చేయాల్సి ఉంది. 402 చోట్ల వ్యయ అంచనాలు రూపొందించారు. తొలి విడతగా రూ.2 కోట్లు రావడంతో 15 శాతం చొప్పున 132 బడులకు అడ్వాన్సులు చెల్లించారు. ఆయా చోట్ల పూర్తిస్థాయి బిల్లుల చెల్లింపులతో పాటు.. మిగతా 270 బడుల్లో పనులు చేయాలంటే బడ్జెట్ మంజూరు కావాల్సి ఉంది. అయితే రూ.30 లక్షలు దాటే పనులను ఈ వేలం ద్వారా చేపట్టాల్సి ఉంది. కానీ వీటిని పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు రూ.10 లక్షల వరకే లాగిన్ అయ్యే పరిమితి ఉంది. సాంకేతికంగా మార్పులు చేయడంలో జాప్యం జరుగుతుంది.
లక్ష్యాన్ని కుదించుకొని..
ఉపాధి హామీ పథకం నిధులతో మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్షెడ్లు నిర్మించాల్సి ఉంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కొత్త నిర్మాణాల బాధ్యతలు తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. కాంట్రాక్టు పనులపై గ్రామాల్లో ఆసక్తి చూపే కొందరు సర్పంచులు, మహిళా సర్పంచుల భర్తలు కూడా వీటి విషయంలో ముందుకు రావట్లేదు. ‘ఇటీవల సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాం. ఆ బిల్లులు వస్తేగాని మరో పనికి పెట్టుబడి పెట్టలేమని’ వారు చెబుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాన్ని వాయిదా వేశారు. తొలుత 84 చోట్ల ప్రహరీలు, 83 చోట్ల కిచెన్ షెడ్లు నిర్మించాలని భావిస్తున్నారు. 200 మీటర్లలోపు విస్తీర్ణం ఉన్నవి చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికీ మూడు చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో మంజూరయ్యే నిధులతో బకాయిలన్ని తీర్చేసి.. ఆయా గుత్తేదార్లకే కొత్త పనులు అప్పగించాలనే ఆలోచనతో ఉన్నారు.
బిల్లుల చెల్లింపులకు భరోసా ఇస్తున్నాం
- బావన్న, పీఆర్ ఈఈ
మరమ్మతులు, కొత్త నిర్మాణాల పనులను ఆరు ఇంజినీర్ల విభాగాలు పర్యవేక్షిస్తున్నాయి. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు ముందుకురాని చోట గుత్తేదార్లకు అప్పగిస్తున్నాం. చాలావరకు విద్యుత్తు సమస్యలు, చిన్న చిన్న మరమ్మతులు పూర్తయ్యాయి. వివిధ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. త్వరలో నిధులు మంజూరైతే రెండో విడతలో మిగతా పనులు చేపడతాం. ఉపాధి హామీ పథకం నిధులు క్రమం తప్పకుండా వస్తున్నాయి. బిల్లుల చెల్లింపులపై గుత్తేదారులకు భరోసా ఇస్తున్నాం. ఈ విషయాన్ని వివరించి పనులు చేసేలా ఒప్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై