హరితం.. ఆహ్లాదభరితం
మున్సిపాలిటీలకు సమీపంలోని అటవీ భూముల్లో మరిన్ని అర్బన్ పార్కులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చదనం.. ఆహ్లాదకర వాతావరణానికి తోడు బహుళ ప్రయోజనాలతో వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే సారంగపూర్లో ఒకటి అందుబాటులోకి రాగా..
నగరంలో మూడు అర్బన్ పార్కుల ఏర్పాటు
ఈనాడు, నిజామాబాద్
చిన్నాపూర్ పార్కులో కొనసాగుతున్న పనులు
మున్సిపాలిటీలకు సమీపంలోని అటవీ భూముల్లో మరిన్ని అర్బన్ పార్కులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చదనం.. ఆహ్లాదకర వాతావరణానికి తోడు బహుళ ప్రయోజనాలతో వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే సారంగపూర్లో ఒకటి అందుబాటులోకి రాగా.. 63వ నంబర్ జాతీయ రహదారిపై మరొకటి రూపుదిద్దుకొంటుంది. తాజాగా భీమ్గల్లో లింబాద్రి గుట్టకు సమీపంలో అర్బన్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ‘నగర యోజన ఉద్యాన్ పథకం’ కింద రూ.2 కోట్లు ఇస్తోంది. వీటికి తోడు కంపా నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొంత మంజూరవుతోంది. పార్కుల నిర్వహణలోనూ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
* సారంగపూర్లో 20 హెక్టార్లలో రూ.3.5 కోట్లతో అభివృద్ధి చేశారు. పిల్లల ఆట పరికరాలు, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కల్పించారు. అడ్వెంచర్ గేమ్స్కు ఏర్పాట్లు జరిగినా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది పూర్తిగా సందర్శకుల వినియోగంలో ఉంటున్నప్పటికీ.. కేవలం అర కిలోమీటర్ మేర వాకింగ్ ట్రాక్.. ఆకర్షణీయ మొక్కలతో సరిపెట్టారు. దీన్ని అలీసాగర్ వెనుకవైపుగా విస్తరించాలని ఆలోచిస్తున్నారు. అయితే రెవెన్యూ-అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం పరిష్కార దిశగా చర్చలు జరుగుతున్నాయి. సందర్శకులు పరిసరాలను వీక్షించే విధంగా వ్యూ పాయింట్లు ఉండాలని భావిస్తున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే నీటి కుంటలను అభివృద్ధి చేయడం, ఖాళీ స్థలాల్లో పెద్ద మొత్తంలో వివిధ జాతుల మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించారు.
చిన్నాపూర్లో..
నగరానికి సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కన చిన్నాపూర్లో 166 హెక్టార్లలో అర్బన్ పార్కు రూపుదిద్దుకొంటుంది. ఇప్పటివరకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా మరో రూ.3.62 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నెలాఖరులోగా దీన్ని ప్రారంభించనున్నారు. ఇందులో 25 హెక్టార్లను సందర్శకులకు కేటాయించారు. ఆహ్లాదకర వాతావరణంలో కూర్చోవడానికి వీలుగా బల్లలు.. పిల్లల కోసం ఆట పరికరాలు అమర్చనున్నారు. 5.2 కిలోమీటర్ల మేర జాగింగ్ ట్రాక్ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. క్యాంటీన్, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మిగతా విస్తీర్ణంలో మూడు నీటి కుంటలను అభివృద్ధి చేస్తున్నారు. కందకాలు తవ్వుతున్నారు. పార్కు ఆవరణలో కాలువల మీదుగా వంతెనలు నిర్మించారు. దట్టమైన అడవిలో సంచరిస్తున్న అనుభూతి కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 8-10 రకాల ఔషధ మొక్కలు నాటుతున్నారు. బండరాళ్లను తొలగించకుండా.. రాక్ గార్డెన్ తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నారు.
భీమ్గల్లో..
లింబాద్రి గుట్టకు సమీపంలోనే అటవీ భూముల్లో 130 హెక్టార్లలో అర్బన్ పార్కును ప్రతిపాదించారు. మంజూరుకు అటవీశాఖ మంత్రి పచ్చజెండా ఊపారు. తాజాగా జిల్లా మంత్రి ప్రశాంత్రెడ్డి అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రూ.10.90 కోట్ల అంచనాలతో అభివృద్ధి చేయనున్నారు. వారాంతాల్లో ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు. తిరుపతి తరహాలో భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులోనూ నీటి కుంటలు, మొక్కల పంపకం చేపడతారు. ‘ప్రకృతిపై అవగాహన కల్పించేలా అర్బన్ పార్కులు ఉండనున్నాయని’ డీఎఫ్వో సునీల్ హెరామత్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ సభ్యులు
[ 18-04-2024]
తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. -
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అశుతోష్ అదరగొట్టినా.. ముంబయిదే విజయం
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం