విస్తరణ.. పచ్చదనం ప్రక్షాళన
ఓ మొక్క ఎదిగి మహావృక్షం కావాలంటే కొన్నేళ్లు పడుతుంది. అలాంటి వాటిని నిమిషాల్లో నేలమట్టం చేస్తున్నారు. ఒక పక్క పచ్చదనం పెంపునకు ప్రభుత్వం హరితహారం పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే.. మరో పక్క అభివృద్ధి పేరిట భారీ చెట్లను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తున్నారు.
న్యూస్టుడే, భిక్కనూరు
భిక్కనూరు చర్చి గేటు వద్ద తొలగించిన భారీ మర్రి వృక్షం
ఓ మొక్క ఎదిగి మహావృక్షం కావాలంటే కొన్నేళ్లు పడుతుంది. అలాంటి వాటిని నిమిషాల్లో నేలమట్టం చేస్తున్నారు. ఒక పక్క పచ్చదనం పెంపునకు ప్రభుత్వం హరితహారం పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే.. మరో పక్క అభివృద్ధి పేరిట భారీ చెట్లను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తున్నారు. భిక్కనూరులో రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 40 భారీ చెట్లను కొట్టేశారు. మరో 15 తొలగించే పనిలో ఉన్నారు. అవసరం లేని చోట అనుమతులు లేకుండా కొట్టేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
22కే అనుమతి
రోడ్లు, భవనాలశాఖ అధికారులు భిక్కనూరులో పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు వేప 12, మామిడి 1, మర్రి 5, నిద్ర గన్నేరు 1, చింత చెట్లు 3 కలిపి మొత్తం 22 చెట్ల తొలగింపునకు అటవీశాఖ అధికారులను కోరారు. వాటి రకం, ధరను అంచనా వేసిన అధికారులు ర.భ.శాఖకు నివేదించారు. 22 చెట్లకుగాను రూ.2.47 లక్షల ధరను నిర్ణయించి టెండర్లు నిర్వహించగా నలుగురు పాల్గొన్నారు. ఓ గుత్తేదారు రూ.3.36 లక్షలకు దక్కించుకున్నారు. అదనంగా 18శాతం జీఎస్టీ కూడా విధించినట్లు చెబుతున్నారు. ఈ అనుమతుల ముసుగులో ఇక్కడి రోడ్డుకు ఇరువైపులా సుమారు 65 వృక్షాలు ఉండగా ఇప్పటికే 40 నరికేశారు. ఒక చెట్టును కొట్టేసిన తరువాత దానికి గుర్తింపు సంఖ్య వేయాల్సి ఉండగా కొన్నింటికే కనిపిస్తున్నాయి.
మరోచోటకు తరలింపు
రోడ్డుకు సుమారు నాలుగు మీటర్ల దూరంలో ఉన్న చెట్లను కూడా తొలగించారు. దీనిపై గ్రామస్థులు, ప్రకృతి ప్రేమికులు గగ్గొలు పెడుతున్నా లెక్క చేయడం లేదు. కోతులు వస్తున్నాయని, ఇళ్లకు అడ్డుగా ఉన్నాయన్న సాకుతో కొన్నింటిని అక్రమంగా అమ్ముకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జుక్కల్ నియోజకవర్గం పిట్లం అటవీ రేంజి పరిధిలోని సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్డు విస్తరణలో భాగంగా చెట్లను కొట్టేయకుండా వేర్లతో సహా తొలగించి మరోచోట నాటించారు. జుక్కల్, పిట్లం రేంజి పరిధిలోని నర్సింగరావుపల్లి అటవీ ప్రాంతంలో ప్రస్తుతం అవి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. బీబీపేట మండలం యాడారం శివారులోని ఓ మందిరం వద్ద తొలగించిన మూడు చెట్లను సైతం ఇదే విధంగా మరోచోట నాటించారు. భిక్కనూరులో మాత్రం నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు.
పోలీసుస్టేషన్ ఎదురుగా కొట్టేసిన వేప చెట్లు
ఎక్కువ సమయం పడుతుందన్నారు
- తునికి వేణు, సర్పంచి, భిక్కనూరు
చెట్లను మరోచోట తరలించి నాటించాలనే ఉద్దేశంతో ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించాం. ఎక్కువ సమయం పడుతుందని చెప్పడంతో వీలుకాలేదు. కొన్ని చెట్లు విద్యుత్తు లైనుకు అడ్డుగా ఉండడంతో తొలగించాం.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
- రమేశ్, అటవీ రేంజి అధికారి, కామారెడ్డి
రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు, భవనాల శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు 22 చెట్ల తొలగింపునకు అనుమతులిచ్చాం. అంతకు మించి కొట్టేసినట్లు తమ దృష్టికి రాలేదు. పరిశీలించి వాల్టా చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 19-04-2024]
తాండూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి 6 గ్యారంటీలు, రుణమాఫీ గురించి స్థానిక కాంగ్రెస్ నాయకులు వివరించారు. -
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్