ఆయకట్టు పెంపు.. పైపులైన్లకే మొగ్గు
ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జక్కాపూర్- కోమలంచ సరిహద్దుల్లో మంజీర నదిపై ప్రతిపాదిత ఆనకట్ట నిర్మాణ ప్రదేశంలో వీవర్(ఆనకట్ట అడుగుభాగం) నిర్మాణ పనులు చేపట్టారు. మంజీర వరద వచ్చేలోపు పూర్తి చేయాలని
నాగమడుగు ఎత్తిపోతల పనులు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, న్యూస్టుడే, నిజాంసాగర్
ఆనకట్ట నిర్మాణ ప్రాంతంలో వీయర్ పనులు
ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జక్కాపూర్- కోమలంచ సరిహద్దుల్లో మంజీర నదిపై ప్రతిపాదిత ఆనకట్ట నిర్మాణ ప్రదేశంలో వీవర్(ఆనకట్ట అడుగుభాగం) నిర్మాణ పనులు చేపట్టారు. మంజీర వరద వచ్చేలోపు పూర్తి చేయాలని యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేత శంకుస్థాపన చేయాలని వేచిచూసిన అధికారులు ఆయకట్టు రైతులకు నిర్దేశిత సమయంలో సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభించారు. సీఎం వచ్చినప్పుడు పైలాన్ ఆవిష్కరించి పంప్హౌస్ నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తున్నారు.
నీటి నిల్వకు..
ఆనకట్ట నిర్మాణ ప్రదేశంలో మొదటగా నీటి నిల్వ కోసం వీయర్ పనులు ప్రారంభించినట్లు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. తదనంతరం ఆనకట్ట నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ రెండు పూర్తికాగానే పంప్హౌస్ పనులు ప్రారంభించనున్నారు. ఏడాదిన్నరలో ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.
రెండు పంప్హౌస్లు.. మూడు సంప్లు
తలాపునే నిజాంసాగర్ జలాశయం ఉన్నా మండలంలోని ఎనిమిది గ్రామాలకు చుక్కనీరందని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిట్లం, బిచ్కుంద, పెద్దకొడపగల్ మండలాల్లోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. రీడిజైన్ చేసి మరో పది వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రభుత్వం రూ.476.25 కోట్లు మంజూరు చేసింది. ఆనకట్ట నిర్మాణ ప్రాంతంలో రెండు పంటలు పండే సారవంతమైన భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రెండు పంప్హౌస్లు, మూడ్ సంప్లు నిర్మించి పైప్లైన్ ద్వారా సాగునీరు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఎత్తిపోతల ద్వారా మొదటి పంప్హౌస్లోకి.. అక్కడి నుంచి పైప్లైన్ ద్వారా సంప్లలో నింపుతూ రెండో పంప్హైస్లోకి పంపించేలా ప్రణాళికలు రూపొందించారు. తరువాత కాలువల తవ్వి ఆయకట్టకు నీటిని సరఫరా చేయనున్నారు.
వ్యయం తగ్గించేందుకు పాత మోటార్లు
మొదటి పంప్హౌస్లో ఐదు, రెండో దాంట్లో మూడు మోటార్లు ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేశారు. అదనంగా పది వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిన నేపథ్యంలో ప్రతిపాదిత వ్యయం పెరగనుంది. ఆర్థిక శాఖ అనుమతులు లభించే అవకాశాలు లేకపోవడంతో పాత మోటార్లు వినియోగించి ఖర్చు తగ్గించాలని నిర్ణయించారు. గతంలో కొత్తగూడెంలో వినియోగించిన వాటిని ఇక్కడికి తెప్పిస్తున్నారు.
నిర్దేశిత సమయంలో పూర్తి
- శ్రీనివాస్, సీఈ, జలవనరులశాఖ, కామారెడ్డి
నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. స్థిరీకరించిన పది వేల ఆయకట్టుకు అనుగుణంగా చేపడుతున్నాం. మొత్తం 40 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురపాలక ఛైర్మన్పై అవిశ్వాసం
[ 24-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భారాస పార్టీ కౌన్సిలర్లు తీర్మానించినట్లు తెలుస్తుంది. -
కాంగ్రెస్లో చేరిన పుర ఛైర్మన్
[ 24-04-2024]
పుర ఛైర్మన్ సత్యనారాయణ సంగారెడ్డిలో బుధవారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. -
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం