logo

డిగ్రీ కళాశాలలకు నోటీసులు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్‌ ఎంఎస్‌ఆర్‌, బోధన్‌లోని ఉషోదయ డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలలకు వీసీ ఆచార్య రవీందర్‌ ఆదేశాల ప్రకారం రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వర్సిటీ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌

Published : 03 Jul 2022 03:26 IST

తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్‌ ఎంఎస్‌ఆర్‌, బోధన్‌లోని ఉషోదయ డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలలకు వీసీ ఆచార్య రవీందర్‌ ఆదేశాల ప్రకారం రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వర్సిటీ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ విద్యావర్ధిణి ఆధ్వర్యంలో కళాశాలల్లో తనిఖీ చేశారు. కోర్సులకు అనుగుణంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, మూత్రశాలలు, ఆట స్థలం, వాహన పార్కింగ్‌ సౌకర్యం లేవని తేల్చారు.

ఐదుగురు డిబారు

తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెవివి పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో బోధన్‌లోని ప్రభుత్వ కళాశాల కేంద్రంలో ఇద్దరు, ఆర్మూర్‌ ప్రభుత్వ కళాశాల, నిజామాబాద్‌లోని ఎంఎస్‌ఆర్‌ కళాశాల, నిశిత కళాశాలల్లో ఒకరు చొప్పున మొత్తం ఐదుగురు విద్యార్థులు డిబార్‌ అయినట్లు వర్సిటీ సీవోఈ ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు