ఉపాధి డబ్బులు.. నింపాది
ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదు. వేసవిలో చేసిన పనులకు సంబంధించి ఇప్పటికీ రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత చెల్లింపులు మందగించాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చేసిన పనులకు మూడు నెలలు ఆలస్యంగా వచ్చాయి. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ
మూడు నెలలుగా కూలీల ఎదురుచూపులు
ఉమ్మడి జిల్లాలో రూ.82 లక్షలు పెండింగ్
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదు. వేసవిలో చేసిన పనులకు సంబంధించి ఇప్పటికీ రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత చెల్లింపులు మందగించాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చేసిన పనులకు మూడు నెలలు ఆలస్యంగా వచ్చాయి. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త సంవత్సరం మొదలైంది. మే నుంచి జూన్ వరకు చేసిన పనులకు సంబంధించి వేలాది మందికి కూలి అందని పరిస్థితి. గతంలో తపాలా కార్యాలయంలో ప్రత్యక్షంగా అందజేసేటప్పుడు క్రమం తప్పకుండా వచ్చేవి. గతేడాది డిసెంబరు నుంచి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 9560 మంది కూలీలకు రూ.82 లక్షలు అందాల్సి ఉంది.
బ్యాంకు ఖాతాలు లేక..
కేంద్రం అమలు చేస్తున్న ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) సాఫ్ట్వేర్ కారణంగా కొందరు కూలీల పేరు రెండు గ్రామ పంచాయతీల్లో నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కొత్త జపీలు ఆవిర్భవించినప్పటికీ ఉపాధి రికార్డుల్లో రెండు జీపీల్లోనూ ఉన్నట్లు చూపాయి. అధికారులు స్పందించి వాటిని సరి చేసేలోపు వేలాది మందికి డబ్బులు ఆలస్యమయ్యాయి. మరికొందరికి మూడు నెలలుగా జమకావడం లేదు. కొత్త సాఫ్ట్వేర్ ప్రకారం జాతీయస్థాయి బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వారికి మాత్రమే జమవుతున్నాయి. గ్రామీణ బ్యాంకుల్లోని ఖాతాలను అనుమతించట్లేదు.
ఒక్కొక్కరికి రూ.9 వేల వరకు
ప్రస్తుతం బకాయి ఉన్న కూలీలకు ఒక్కొక్కరికి మూడు నెలలకు గాను రూ.7 వేల- 9 వేల వరకు చెల్లించాల్సి ఉంది. తమ ఖాతాల్లో ఎప్పుడు వేస్తారోనని ఎదురు చూస్తున్నారు. సమయానికి చేతికి అందక కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు.
త్వరలో వస్తాయి..
- సాయన్న, డీఆర్డీవో, కామారెడ్డి
కూలీలకు ఉపాధి డబ్బులు త్వరలో జమ చేస్తాం. కొందరికి బ్యాంకు ఖాతాలు లేక ఇబ్బందవుతోంది. వారితో జాతీయ బ్యాంకుల్లో ఖాతా తెరిపించడానికి యత్నిస్తున్నాం. తపాలాశాఖ అనుసంధానంతోనూ బ్యాంకు ఖాతా తెరుచుకునే అవకాశం కల్పించారు. కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పని చేసిన డబ్బులు జమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?