logo

ఉమ్మడి జిల్లా ఖో-ఖో అసోసియేషన్‌ అధ్యక్షుడిగా భూమారెడ్డి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఖో-ఖో అసోసియేషన్‌ అధ్యక్షుడిగా భూమారెడ్డి ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని లయోలా పాఠశాలలో ఆదివారం అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు.

Published : 08 Aug 2022 04:40 IST

 
నూతన కార్యవర్గ సభ్యులు

కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఖో-ఖో అసోసియేషన్‌ అధ్యక్షుడిగా భూమారెడ్డి ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని లయోలా పాఠశాలలో ఆదివారం అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా ఎండి అతీకుల్లా, ఉపాధ్యక్షులుగా గోపి, మోహన్‌, హుస్సేన్‌, శ్రీనివాస్‌రావు, సంయుక్త కార్యదర్శులుగా రాజేశ్వర్‌, రాము, సుజాత, రాజాగౌడ్‌, కోశాధికారిగా మధుసూదన్‌రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఖో-ఖో అసోసియేషన్‌ అడ్‌హక్‌ ఛైర్మన్‌ మహేందర్‌రావు, కన్వీనర్‌ లింగన్న, మధుసూదన్‌రెడ్డి, శ్యాంగోపాల్‌, నిజామాబాద్‌ క్రీడా ప్రాధికార సంస్థ కబడ్డీ శిక్షకులు ప్రశాంత్‌, శివకుమార్‌, జిల్లా ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి సుబ్బారావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని